ఇంతకు ముందైతే కొత్త సినిమాల థియేట్రికల్ రిలీజ్ కోసం మాత్రమే ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ తర్వాత శాటిలైట్, డివిడి, యూట్యూబ్ తదితరాల్లో బాగా ఆలస్యం ఉండేది కాబట్టి వాటి తాలూకు ఎగ్జైట్మెంట్ నెలల తరబడి కొనసాగేది. కానీ ఇప్పుడలా కాదు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే మహా అయితే నెల రోజులు లేదా అదనంగా మరో వారం. అంతకన్నా లేట్ చేస్తే జనాల్లో ఆసక్తి తగ్గిపోయి ఇంత లేటా అంటూ చూడటం కూడా ఆలస్యం చేస్తున్నారు. అందుకే కొలిమి వేడి మీద ఉన్నప్పుడే పని కానిచ్చేయాలి. లేదంటే తేడాలొస్తాయి. అది హిట్ బొమ్మైనా ఫ్లాప్ మూవీ అయినా.
సీతారామం 35 రోజులకే ప్రైమ్ లో వచ్చేసింది. మిలియన్ల వ్యూస్ తో ఆ ప్లాట్ ఫార్మ్ మీద టాప్ 1 ట్రెండింగ్ లో ఉంది. హిందీ వెర్షన్ విడుదలైన వారానికే దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ చేసేయడంతో అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఓటిటి ఫ్యాన్స్ చూపు బింబిసార, కార్తికేయ 2 మీద ఉంది. ఈ రెండు హక్కులు జీ5 సాంతం చేసుకుంది. ప్రీమియర్ల విషయంలో కొంత నెమ్మదిగా ఉండే ఈ సంస్థ వీటిని కూడా ఆలస్యం చేస్తూ వస్తోంది. నిఖిల్ మూవీ బాలీవుడ్ లో మొదటి రెండు మూడు వారాలు దూసుకుపోయినప్పటికీ బ్రహ్మాస్త్ర వచ్చాక నెమ్మదించక తప్పలేదు.
ఇక కళ్యాణ్ రామ్ సినిమా ఎప్పుడో స్లో అయ్యింది. ప్రధాన కేంద్రాల్లో మాత్రమే రన్ కొనసాగుతోంది. బయ్యర్లకు డబుల్ ప్రాఫిట్స్ వచ్చేశాయి కనక ఇక ఆశించడానికి ఏమి లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం బింబిసారని సెప్టెంబర్ 23 డిజిటల్ డేట్ లాక్ చేసే ఆలోచనలో సదరు టీమ్ ఉన్నట్టు సమాచారం. కార్తికేయ 2ని వారం గ్యాప్ తో అదే నెల 30, ఒకవేళ అది సాధ్యం కాకపోతే దసరా కానుకగా అక్టోబర్ 5 లేదా 7న వదిలే ప్లానింగ్ జరుగుతోందట. వీటిలో ఏ డేట్ కన్ఫర్మ్ అయినా చాలా దగ్గరలో ఉన్నట్టే. థియేటర్లలోనే అంత భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న బింబిసార, కార్తికేయ 2లు ఓటిటిలో చేయబోయే రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో
This post was last modified on September 17, 2022 6:38 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…