ఇంతకు ముందైతే కొత్త సినిమాల థియేట్రికల్ రిలీజ్ కోసం మాత్రమే ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ తర్వాత శాటిలైట్, డివిడి, యూట్యూబ్ తదితరాల్లో బాగా ఆలస్యం ఉండేది కాబట్టి వాటి తాలూకు ఎగ్జైట్మెంట్ నెలల తరబడి కొనసాగేది. కానీ ఇప్పుడలా కాదు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే మహా అయితే నెల రోజులు లేదా అదనంగా మరో వారం. అంతకన్నా లేట్ చేస్తే జనాల్లో ఆసక్తి తగ్గిపోయి ఇంత లేటా అంటూ చూడటం కూడా ఆలస్యం చేస్తున్నారు. అందుకే కొలిమి వేడి మీద ఉన్నప్పుడే పని కానిచ్చేయాలి. లేదంటే తేడాలొస్తాయి. అది హిట్ బొమ్మైనా ఫ్లాప్ మూవీ అయినా.
సీతారామం 35 రోజులకే ప్రైమ్ లో వచ్చేసింది. మిలియన్ల వ్యూస్ తో ఆ ప్లాట్ ఫార్మ్ మీద టాప్ 1 ట్రెండింగ్ లో ఉంది. హిందీ వెర్షన్ విడుదలైన వారానికే దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ చేసేయడంతో అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఓటిటి ఫ్యాన్స్ చూపు బింబిసార, కార్తికేయ 2 మీద ఉంది. ఈ రెండు హక్కులు జీ5 సాంతం చేసుకుంది. ప్రీమియర్ల విషయంలో కొంత నెమ్మదిగా ఉండే ఈ సంస్థ వీటిని కూడా ఆలస్యం చేస్తూ వస్తోంది. నిఖిల్ మూవీ బాలీవుడ్ లో మొదటి రెండు మూడు వారాలు దూసుకుపోయినప్పటికీ బ్రహ్మాస్త్ర వచ్చాక నెమ్మదించక తప్పలేదు.
ఇక కళ్యాణ్ రామ్ సినిమా ఎప్పుడో స్లో అయ్యింది. ప్రధాన కేంద్రాల్లో మాత్రమే రన్ కొనసాగుతోంది. బయ్యర్లకు డబుల్ ప్రాఫిట్స్ వచ్చేశాయి కనక ఇక ఆశించడానికి ఏమి లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం బింబిసారని సెప్టెంబర్ 23 డిజిటల్ డేట్ లాక్ చేసే ఆలోచనలో సదరు టీమ్ ఉన్నట్టు సమాచారం. కార్తికేయ 2ని వారం గ్యాప్ తో అదే నెల 30, ఒకవేళ అది సాధ్యం కాకపోతే దసరా కానుకగా అక్టోబర్ 5 లేదా 7న వదిలే ప్లానింగ్ జరుగుతోందట. వీటిలో ఏ డేట్ కన్ఫర్మ్ అయినా చాలా దగ్గరలో ఉన్నట్టే. థియేటర్లలోనే అంత భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న బింబిసార, కార్తికేయ 2లు ఓటిటిలో చేయబోయే రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో
This post was last modified on September 17, 2022 6:38 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…