చాన్నాళ్ల తర్వాత గత ఏడాది క్రాక్ రూపంలో మంచి విజయాన్ని అందుకున్నాడు మాస్ రాజా రవితేజ. కానీ ఆ ఆనందం ఆయనకు ఎక్కువ రోజులు నిలవలేదు. ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండు చిత్రాలు ఆయనను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అందులో ఒకటి ఖిలాడి కాగా.. ఇంకోటి రామారావు ఆన్ డ్యూటీ.
ఖిలాడి కనీసం ఓపెనింగ్స్ అయినా తెచ్చుకుంది, మాస్ ప్రేక్షకులను కొంత మేర మెప్పించింది. కానీ రామారావు ఆన్ డ్యూటీ మాత్రం అన్ని రికాలుగా నిరాశపరిచింది. మాస్ రాజా కెరీర్లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకుని అతి పెద్ద డిజాస్టర్గా నిలిచిందా చిత్రం. ఈ దెబ్బతో రవితేజ ఇలాంటి ప్రయోగాత్మక, తన ఇమేజ్కు సరిపడని సినిమాల జోలికే వెళ్లడేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కానీ యంగ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ ప్రయోగాత్మక చిత్రం చేయడానికి మాస్ రాజా రెడీ అయినట్లు తెలుస్తోంది. కార్తీక్ ఇంతకుముందే ఓ హాలీవుడ్ సినిమా ఆధారంగా సూర్య వెర్సస్ సూర్య అనే చిత్రం తీశాడు. అది పర్వాలేదనిపించింది. కమర్షియల్గా పెద్ద సక్సెస్ కాకపోవడంతో మళ్లీ ఛాయాగ్రహణానికే పరిమితం అయ్యాడు కార్తీక్. ఇప్పుడతను మాస్ రాజాతో సినిమా తీయబోతున్నాడట. తన స్క్రిప్టుకు రవితేజ ఓకే చెప్పాడట. ఇందులో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించనుందట.
ఐతే చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఓ హాలీవుడ్ హిట్కు ఫ్రీమేక్ అట. ఆ సినిమా.. జాన్ విక్ అంటున్నారు. ఇందులో హాలీవుడ్ స్టార్ కియాను రీవ్స్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా ఒక వైవిధ్య కథాంశంతో తెరకెక్కింది. మరణించిన తన భార్య తనకు చివరి బహుమతిగా ఇచ్చిన కుక్కపిల్లను చంపేసి, తనకెంతో ఇష్టమైన కారును దొంగిలించుకుని వెళ్లిన దుండగులను వేటాడే వ్యక్తి కథ ఇది. దీన్ని ఇండియనైజ్ చేసి కమర్షియల్ ఫార్మాట్లో తీయడానికి కార్తీక్ రెడీ అయినట్లు సమాచారం.
This post was last modified on September 14, 2022 8:54 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…