చాన్నాళ్ల తర్వాత గత ఏడాది క్రాక్ రూపంలో మంచి విజయాన్ని అందుకున్నాడు మాస్ రాజా రవితేజ. కానీ ఆ ఆనందం ఆయనకు ఎక్కువ రోజులు నిలవలేదు. ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండు చిత్రాలు ఆయనను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అందులో ఒకటి ఖిలాడి కాగా.. ఇంకోటి రామారావు ఆన్ డ్యూటీ.
ఖిలాడి కనీసం ఓపెనింగ్స్ అయినా తెచ్చుకుంది, మాస్ ప్రేక్షకులను కొంత మేర మెప్పించింది. కానీ రామారావు ఆన్ డ్యూటీ మాత్రం అన్ని రికాలుగా నిరాశపరిచింది. మాస్ రాజా కెరీర్లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకుని అతి పెద్ద డిజాస్టర్గా నిలిచిందా చిత్రం. ఈ దెబ్బతో రవితేజ ఇలాంటి ప్రయోగాత్మక, తన ఇమేజ్కు సరిపడని సినిమాల జోలికే వెళ్లడేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కానీ యంగ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ ప్రయోగాత్మక చిత్రం చేయడానికి మాస్ రాజా రెడీ అయినట్లు తెలుస్తోంది. కార్తీక్ ఇంతకుముందే ఓ హాలీవుడ్ సినిమా ఆధారంగా సూర్య వెర్సస్ సూర్య అనే చిత్రం తీశాడు. అది పర్వాలేదనిపించింది. కమర్షియల్గా పెద్ద సక్సెస్ కాకపోవడంతో మళ్లీ ఛాయాగ్రహణానికే పరిమితం అయ్యాడు కార్తీక్. ఇప్పుడతను మాస్ రాజాతో సినిమా తీయబోతున్నాడట. తన స్క్రిప్టుకు రవితేజ ఓకే చెప్పాడట. ఇందులో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించనుందట.
ఐతే చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఓ హాలీవుడ్ హిట్కు ఫ్రీమేక్ అట. ఆ సినిమా.. జాన్ విక్ అంటున్నారు. ఇందులో హాలీవుడ్ స్టార్ కియాను రీవ్స్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా ఒక వైవిధ్య కథాంశంతో తెరకెక్కింది. మరణించిన తన భార్య తనకు చివరి బహుమతిగా ఇచ్చిన కుక్కపిల్లను చంపేసి, తనకెంతో ఇష్టమైన కారును దొంగిలించుకుని వెళ్లిన దుండగులను వేటాడే వ్యక్తి కథ ఇది. దీన్ని ఇండియనైజ్ చేసి కమర్షియల్ ఫార్మాట్లో తీయడానికి కార్తీక్ రెడీ అయినట్లు సమాచారం.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…