భాష ఏదైనా హీరోలకు మార్కెట్ పెరగాలంటే మాస్ సపోర్ట్ చాలా అవసరం. అది లేకపోతే ఎన్ని సినిమాలు చేసినా రేంజ్ ఒక స్థాయికే పరిమితమవుతుంది. కాకపోతే ఏ సమయంలో చేయాలని నిర్ణయించుకోవడం కీలకం. అలా కాకుండా తొందరపడితే ఏం జరుగుతుందో ముందే చెప్పలేం కానీ జాగ్రత్తగా ఉండటం మాత్రం అవసరమే. కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని ఈ నెల 16న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ చేతుల మీద ట్రైలర్ లాంచ్ చేయించారు. ఓ మోస్తరుగా ఉన్న బజ్ కు దీని వల్ల కొంత ఊపొచ్చింది.
ఇదంతా బాగానే ఉంది కానీ కిరణ్ అయిదో సినిమాకే ఫుల్ మాస్ గా ట్రై చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ మూవీనే గమనిస్తే ఒకపక్క తండ్రి కూతుళ్ళ ఎమోషన్, మరోపక్క క్యాబ్ డ్రైవర్ గా హీరో యాక్షన్ ప్లస్ కామెడీ, ఇంకోవైపు పంచె గళ్ళలుంగీ కట్టుకుని విలన్ లాంటి మామకు ఛాలెంజ్ విసరడాలు అంతా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లా అనిపిస్తోంది. హీరోయిన్ సంజన లుక్స్ కూడా ఏమంత ఆకట్టుకునేలా లేవు. ఆల్రెడీ రిలీజ్ చేసిన రెండు లిరికల్ వీడియోల్లో మణిశర్మ బ్రాండ్ ఊర మాస్ ట్యూన్లు సాహిత్యమే వినిపించింది. ఇదంతా గమనిస్తే ఎలా అయినా మాస్ ని మెప్పించాలనే తాపత్రయమే కనిపిస్తోంది.
ఎస్ఆర్ కళ్యాణ మండపంతో ఊహించిన దానికన్నా చాలా పెద్ద హిట్టు కొట్టిన కిరణ్ కు అందులో మాస్ ఎలిమెంట్సే దాని విజయానికి కారణమని బలంగా నమ్ముతున్నట్టు ఉంది. దాని రిలీజ్ టైమింగ్, ఫాదర్ ఎమోషన్, కరోనా తర్వాత పెద్ద స్కేల్ లో ప్లాన్ చేసుకోవడం లాంటి సానుకూలంశాలు సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన మాట వాస్తవం. పైగా పాటలు చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. మరి నేను మీకు బాగా కావాల్సిన వాడినిలో ఆ స్థాయిలో పండాయా అనేది చూడాలి. అసలే సగమయ్యాక దర్శకుడు మారాడు. తనకు హిట్టిచ్చిన శ్రీధర్ గాదెని తిరిగి తెచ్చుకోవడంలో కిరణ్ స్ట్రాటజీ ఎంత వర్కౌట్ అవుతుందో 16న తేలనుంది.
This post was last modified on September 8, 2022 9:45 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…