బాయ్కాట్.. బాయ్కాట్.. కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న మాట ఇది. కొంతమంది అదే పనిగా బాలీవుడ్ సినిమాలను టార్గెట్ చేస్తూ.. వాటిని బహిష్కరించాలని సోషల్ మీడియాలో పిలుపునివ్వడం.. ఆ చిత్రాల గురించి ప్రతికూల ప్రచారం చేయడం.. నెగెటివ్ టాక్ను స్ప్రెడ్ చేయడం చూస్తూనే ఉన్నాం.
లాల్ సింగ్ చడ్డా, షంషేరా లాంటి చిత్రాలపై ఈ ప్రభావం కొంత మేర పడిందన్నది వాస్తవం. దీంతో వీరిని చూసి బాలీవుడ్ భయపడే పరిస్థితి వచ్చింది. ఈ బ్యాచ్ను ఎలా డీల్ చేయాలో తెలియక బాలీవుడ్ పెద్దలు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. వారి భయం చూసి బాయ్కాట్ బ్యాచ్ మరింత రెచ్చిపోయి.. రిలీజవుతున్న ప్రతి సినిమానూ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. వాళ్లు లక్ష్యంగా చేసుకున్న కొత్త చిత్రం.. బ్రహ్మస్త్ర.
బాలీవుడ్లో నెపోటిజం బ్యాచ్ అంతా కలిసి చేస్తున్న సినిమా అని.. రణబీర్, ఆలియా గతంలో ఏవో కామెంట్లు చేశారని.. సినిమాలోని ఒక సన్నివేశంలో రణబీర్ చెప్పులేసుకుని గుడిలోకి వెళ్లాడని.. ఇలా ఏవేవో కారణాలు చెప్పి ఈ సినిమాను బాయ్కాట్ లిస్టులోకి చేర్చారు. రోజులు, వారాల తరబడి ఈ సినిమాను టార్గెట్ చేస్తూ ట్రెండ్ నడిపిస్తున్నారు. కానీ ఈ ప్రభావం సినిమా మీద పెద్దగా ఏమీ పడుతున్నట్లు కనిపించడం లేదు. బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్స్ మాంచి జోరు మీద నడుస్తున్నాయి.
ఇప్పటికే దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ ఛైన్లలో 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూళ్లు రూ.10 కోట్ల మార్కును కూడా దాటేశాయి. ఈ ట్రెండ్ చూస్తే బ్రహ్మాస్త్రకు వరల్డ్ వైడ్ తొలి రోజు రూ.25 కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు వచ్చేలా కనిపిస్తోంది. అంటే బాయ్కాట్ బ్యాచ్ అప్పీల్ను జనం ఏమాత్రం పట్టించుకోవట్లేదని.. ఆల్రెడీ బజ్ తక్కువగా ఉన్న సినిమా మీద ఇంకా నెగెటివిటీ పెంచడం తప్పితే.. ప్రేక్షకులు మెచ్చే సినిమాను ఏమీ చేయలేరనడానికి ఇది రుజువు. లైగర్ సినిమా విషయంలో కూడా ఎంత ప్రయత్నించినా విడుదలకు ముందు హైప్ను తగ్గించలేకపోయారు. సినిమా బాలేకపోవడంతోనే దాని గురించి నెగెటివిటీని స్ప్రెడ్ చేయగలిగారన్నది స్పష్టం.
This post was last modified on September 7, 2022 7:08 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…