హీరోలకు సినిమాల్లోనే కష్టాలుంటాయనుకుంటాం. నిజ జీవితంలో వారికి అప్పులు , ఇబ్బందులు ఉంటాయనే ఊహ కూడా రాదు. కానీ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ హీరోలకు అప్పుడప్పుడు కష్టాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తాజాగా హీరో శర్వానంద్ తన జీవితంలో వచ్చిన కష్టాన్ని అప్పు వల్ల పడిన ఇబ్బందులను షేర్ చేసుకున్నాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కలిసి ఒకే ఒక జీవితం సినిమా గురించి స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు శర్వా. ఈ షో లో ఇద్దరు దిల్ సే అంటూ ఆర్గానిక్ గా మాట్లాడుకున్నారు.
ఓ సందర్భంలో లైఫ్ లో వచ్చే ఇబ్బందుల గురించి ఒకరికరు చెప్పుకున్నారు. నాన్న మరణం తర్వాత తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి తెలిసిందని తరుణ్ భాస్కర్ చెప్పుకుంటే , వెంటనే శర్వా కూడా తను ఎదుర్కున్న కష్టాన్ని చెప్పుకున్నాడు. ఇంతకీ శర్వాని ఇబ్బందులకు గురి చేసింది కో అంటే కోటి అనే సినిమా. శర్వానంద్ హీరోగా శ్రీహరి ముఖ్య పాత్రలో ఈ సినిమాకు శర్వానంద్ నిర్మాత. కథను నమ్మి సొంత బేనర్ లో సోదరుడితో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు శర్వా. సినిమా రిజల్ట్ తేడా రావడంతో నిర్మాతగా ఫ్లాప్ అందుకున్నాడు అప్పటి నుండి ఇప్పటి వరకూ నిర్మాణం అనే పదం వినడానికి కూడా ఇష్టపడడు శర్వా.
ఈ ఇంటర్వ్యూలో ఆ సినిమా వల్ల పడిన ఇబ్బందులను మనసు విప్పి పంచుకున్నాడు శర్వా. ఆ సినిమా వల్ల నిర్మాతగా అప్పులపాలయ్యానని, అవి తీర్చడానికి దాదాపు ఆరేళ్ళు పట్టిందని అన్నాడు. ఆ సమయంలో కొత్త షర్ట్ కూడా కొనుక్కొలేదని తనలో ఉన్న బాధను బయటపెట్టాడు. ఆ సినిమా తర్వాత బంధువులు కూడా తమని దూరం పెట్టారని పేర్కొన్నాడు. రన్ రాజా రన్ హిట్టాయ్యాక ప్రభాస్ అన్న పార్టీ ఇచ్చాడని కానీ ఆ సినిమా సూపర్ హిట్ అంటే ఆ టైంలో నమ్మలేకపోయానని సోమవారం మాట్లాడుకుందాం అని అంటే ప్రభాస్ అర్థమయ్యేలా చెప్పాడని ఈ సందర్భంగా ఆ ఇన్సిడెంట్ ను కూడా గుర్తు చేసుకున్నాడు శర్వా.
This post was last modified on September 7, 2022 3:50 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…