మాములుగా పెద్ద హీరోల సినిమాలే హిట్ టాక్ వచ్చినా మహా అయితే రెండు మూడు వారాలకు మించి స్ట్రాంగ్ రన్ కొనసాగించలేని పరిస్థితిలో సీతారామం లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీకి వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఒక కేస్ స్టడీలాగా తీసుకోవచ్చు. ఇటీవలే హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తే అక్కడా మంచి స్పందన దక్కుతోంది. థియేటర్లలో చూసిన వాళ్ళు తమ ఫీడ్ బ్యాక్ ని చాలా పాజిటివ్ గా ట్వీట్ల రూపంలో పెడుతున్నారు. ఇంత ఆలస్యంగా ఎందుకు తీసుకొచ్చారని నిలదీస్తున్న వాళ్ళు లేకపోలేదు. తమిళ మలయాళంలో ఈ స్థాయి రెస్పాన్స్ కాదు కానీ డీసెంట్ గా పే చేయడంలో మాత్రం ఫెయిల్ కాలేదు.
టాలీవుడ్ లో స్టార్ వేల్యూ లేని దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తో దర్శకుడు హను రాఘవపూడి ఆవిష్కరించిన అద్భుతం తాలూకు ఫలితమిది. ఇక ఇప్పుడు అందరి దృష్టి సీతారామం ఓటిటి రిలీజ్ మీద ఉంది. విశ్వసనీయ వర్గాలు చెబుతున్న ప్రకారం అమెజాన్ ప్రైమ్ దీని ప్రీమియర్ ని సెప్టెంబర్ 9కి ప్లాన్ చేసుకుందట. ఇది ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా లాక్ చేసుకున్న డేట్ గా చెబుతున్నారు. మాములుగా ప్రైమ్ ఇలాంటివి ఫిక్స్ చేసుకున్నప్పుడు జస్ట్ ఒకటి రెండు రోజుల ముందు మాత్రమే ప్రమోషన్లు మొదలుపెడుతుంది.
సో నిజంగా ఆ డేట్ కి స్ట్రీమింగ్ ఉంటుందా లేదా అనేది చెప్పలేం. హిందీలో రన్ బాగుంది కాబట్టి కొంతకాలం వాయిదా వేస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పోకిరిలో పండుగాడులా ప్రైమ్ ఒక్కసారి కమిట్ అయితే తన మాట తనే వినదు. గత ఏడాది పుష్ప పార్ట్ 1 ఇరవై రోజులకే వరల్డ్ ప్రీమియర్ చేసినప్పుడు ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కు తగ్గలేదు. రూల్ రూలే అని పెట్టేసింది. మరి సీతారామంకు సైతం అలాగే చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. కాకపోతే బాలీవుడ్ వెర్షన్ ని కొంత లేట్ చేయొచ్చు. ఏదైనా అఫీషియల్ వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. వెయిట్ అండ్ సీ.
This post was last modified on September 4, 2022 6:22 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…