దక్షిణాదిన కొత్త తరం నటుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ విజయ్ సేతుపతి అనడంలో సందేహం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అతను అదరగొట్టేస్తాడు. ఇటీవలే ‘విక్రమ్’ సినిమాలో సంతానం పాత్రలో అతను ఎంత గొప్పగా నటించాడో, సినిమాకు ఎంత బలంగా నిలిచాడో తెలిసిందే. అలాంటి నటుడు తన సినిమాలో ఉండాలని, తన కోసం మంచి పాత్ర రాయాలని ప్రతి దర్శకుడూ కోరుకుంటాడు. తమిళ దర్శకుడైన అట్లీ.. హిందీలో చేయబోతున్న తొలి చిత్రం కోసం విజయ్ సేతుపతినే విలన్గా ఎంచుకోవడం విశేషం.
‘జవాన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో కీలక పాత్రలకు తమిళ నటులనే తీసుకుంటున్నాడు అట్లీ. ఈ క్రమంలోనే విలన్గా విజయ్ సేతుపతిని, కథానాయికగా నయనతారను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ చిత్రానికి విజయ్ సేతుపతి తీసుకోనున్న పారితోషకం గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
‘జవాన్’లో విలన్ పాత్ర పోషించడానికి విజయ్ ఏకంగా రూ.21 కోట్లు పుచ్చుకోనున్నట్లు చెబుతున్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో దీని గురించి తెగ ప్రచారం జరుగుతోంది. కానీ నిజంగా సేతుపతికి అంత రేంజ్ ఉందా అన్నది ప్రశ్న. తన బేస్ అయిన తమిళంలో హీరోగా నటించినా సరే.. సేతుపతి అందులో సగం కూడా తీసుకోడని అంటారు. తన పారితోషకం పది కోట్లకు అటు ఇటుగా ఉంది.
ఇక విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తే వర్కింగ్ డేస్ ఎలాగూ తగ్గుతాయి కాబట్టి రేటు ఇంకా తగ్గుతుంది. తెలుగులో ‘ఉప్పెన’ చిత్రంలో విలన్ పాత్రకు గాను రూ.5 కోట్ల దాకా పుచ్చుకున్నట్లు సమాచారం. అలాంటిది ఎంత హిందీ మూవీ అయితే మాత్రం ఏకంగా రూ.21 కోట్లు ఇచ్చేస్తారా అన్నది సందేహం. అందులోనూ ఈ మధ్య బాలీవుడ్ సినిమాల మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. పెద్ద పెద్ద సూపర్ స్టార్ల సినిమాలకు కూడా దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. ఇలాంటి టైంలో సేతుపతి ఒక్కడికే రూ.21 కోట్లు అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు.
This post was last modified on August 30, 2022 9:58 am
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…