Movie News

సేతుప‌తికి నిజంగా అంతిస్తారా?

దక్షిణాదిన కొత్త తరం నటుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ విజయ్ సేతుపతి అనడంలో సందేహం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అతను అదరగొట్టేస్తాడు. ఇటీవలే ‘విక్రమ్’ సినిమాలో సంతానం పాత్రలో అతను ఎంత గొప్పగా నటించాడో, సినిమాకు ఎంత బలంగా నిలిచాడో తెలిసిందే. అలాంటి నటుడు తన సినిమాలో ఉండాలని, తన కోసం మంచి పాత్ర రాయాలని ప్రతి దర్శకుడూ కోరుకుంటాడు. తమిళ దర్శకుడైన అట్లీ.. హిందీలో చేయబోతున్న తొలి చిత్రం కోసం విజయ్ సేతుపతినే విలన్‌గా ఎంచుకోవడం విశేషం.

‘జవాన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో కీలక పాత్రలకు తమిళ నటులనే తీసుకుంటున్నాడు అట్లీ. ఈ క్రమంలోనే విలన్‌గా విజయ్ సేతుపతిని, కథానాయికగా నయనతారను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ చిత్రానికి విజయ్ సేతుపతి తీసుకోనున్న పారితోషకం గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.

‘జవాన్’లో విలన్ పాత్ర పోషించడానికి విజయ్ ఏకంగా రూ.21 కోట్లు పుచ్చుకోనున్నట్లు చెబుతున్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో దీని గురించి తెగ ప్రచారం జరుగుతోంది. కానీ నిజంగా సేతుపతికి అంత రేంజ్ ఉందా అన్నది ప్రశ్న. తన బేస్ అయిన తమిళంలో హీరోగా నటించినా సరే.. సేతుపతి అందులో సగం కూడా తీసుకోడని అంటారు. తన పారితోషకం పది కోట్లకు అటు ఇటుగా ఉంది.

ఇక విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తే వర్కింగ్ డేస్ ఎలాగూ తగ్గుతాయి కాబట్టి రేటు ఇంకా తగ్గుతుంది. తెలుగులో ‘ఉప్పెన’ చిత్రంలో విలన్ పాత్రకు గాను రూ.5 కోట్ల దాకా పుచ్చుకున్నట్లు సమాచారం. అలాంటిది ఎంత హిందీ మూవీ అయితే మాత్రం ఏకంగా రూ.21 కోట్లు ఇచ్చేస్తారా అన్నది సందేహం. అందులోనూ ఈ మధ్య బాలీవుడ్ సినిమాల మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. పెద్ద పెద్ద సూపర్ స్టార్ల సినిమాలకు కూడా దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. ఇలాంటి టైంలో సేతుపతి ఒక్కడికే రూ.21 కోట్లు అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు.

This post was last modified on August 30, 2022 9:58 am

Share

Recent Posts

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

35 minutes ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

2 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

7 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

8 hours ago