దక్షిణాదిన కొత్త తరం నటుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ విజయ్ సేతుపతి అనడంలో సందేహం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అతను అదరగొట్టేస్తాడు. ఇటీవలే ‘విక్రమ్’ సినిమాలో సంతానం పాత్రలో అతను ఎంత గొప్పగా నటించాడో, సినిమాకు ఎంత బలంగా నిలిచాడో తెలిసిందే. అలాంటి నటుడు తన సినిమాలో ఉండాలని, తన కోసం మంచి పాత్ర రాయాలని ప్రతి దర్శకుడూ కోరుకుంటాడు. తమిళ దర్శకుడైన అట్లీ.. హిందీలో చేయబోతున్న తొలి చిత్రం కోసం విజయ్ సేతుపతినే విలన్గా ఎంచుకోవడం విశేషం.
‘జవాన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో కీలక పాత్రలకు తమిళ నటులనే తీసుకుంటున్నాడు అట్లీ. ఈ క్రమంలోనే విలన్గా విజయ్ సేతుపతిని, కథానాయికగా నయనతారను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ చిత్రానికి విజయ్ సేతుపతి తీసుకోనున్న పారితోషకం గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
‘జవాన్’లో విలన్ పాత్ర పోషించడానికి విజయ్ ఏకంగా రూ.21 కోట్లు పుచ్చుకోనున్నట్లు చెబుతున్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో దీని గురించి తెగ ప్రచారం జరుగుతోంది. కానీ నిజంగా సేతుపతికి అంత రేంజ్ ఉందా అన్నది ప్రశ్న. తన బేస్ అయిన తమిళంలో హీరోగా నటించినా సరే.. సేతుపతి అందులో సగం కూడా తీసుకోడని అంటారు. తన పారితోషకం పది కోట్లకు అటు ఇటుగా ఉంది.
ఇక విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తే వర్కింగ్ డేస్ ఎలాగూ తగ్గుతాయి కాబట్టి రేటు ఇంకా తగ్గుతుంది. తెలుగులో ‘ఉప్పెన’ చిత్రంలో విలన్ పాత్రకు గాను రూ.5 కోట్ల దాకా పుచ్చుకున్నట్లు సమాచారం. అలాంటిది ఎంత హిందీ మూవీ అయితే మాత్రం ఏకంగా రూ.21 కోట్లు ఇచ్చేస్తారా అన్నది సందేహం. అందులోనూ ఈ మధ్య బాలీవుడ్ సినిమాల మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. పెద్ద పెద్ద సూపర్ స్టార్ల సినిమాలకు కూడా దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. ఇలాంటి టైంలో సేతుపతి ఒక్కడికే రూ.21 కోట్లు అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు.
This post was last modified on August 30, 2022 9:58 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…