తెలుగులో మంచి అభిరుచి, భావుకత ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల పేరు ముందు వరుసలో ఉంటుంది. సున్నితమైన అంశాలతో ఆహ్లాదకరమైన సినిమాలు తీస్తాడని శేఖర్కు పేరుంది. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా.. ఇలా ప్రతి సినిమాలోనూ శేఖర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఇందులో చివరి రెండు చిత్రాలతో శేఖర్ బాక్సాఫీస్ను షేక్ చేశాడనే చెప్పాలి. చిన్న సినిమాలుగా రిలీజైన హ్యాపీడేస్, ఫిదా చాలా పెద్ద విజయమే సాధించాయి.
‘ఫిదా’ తర్వాత శేఖర్ మీద భారీ అంచనాలు ఏర్పడగా.. నాగచైతన్య-సాయిపల్లవిల కలయికలో ఆయన రూపొందించిన ‘లవ్ స్టోరి’కి విడుదల ముంగిట భలే హైప్ వచ్చింది. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఒక దశ వరకు సినిమా బాగానే నడిచినా.. చివరికొచ్చేసరికి ప్రేక్షకులకు మిశ్రమానుభూతి కలిగించింది. చివర్లో సినిమాను కొత్త మలుపు తిప్పడం మెజారిటీ ప్రేక్షకులకు నచ్చలేదు. ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ.. ఎక్కువమంది సినిమా సంతృప్తినివ్వలేదు.
ఐతే సినిమాఫలితం ఎలా ఉన్నా కొన్ని రోజుల తర్వాత కొత్త సినిమా మీదికి వెళ్లిపోవడం కామన్. ఐతే శేఖర్ సినిమాకు, సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటాడు. స్క్రిప్టు పని నెమ్మదిగా చేస్తాడు. ఐతే ‘లవ్ స్టోరి’ తర్వాత ఆయన చేయాల్సింది పాన్ ఇండియా మూవీ. అందులో ధనుష్ హీరో. ఈ సినిమా గురించి గత ఏడాది ఘనంగా ప్రకటన చేశారు. కానీ ఇప్పుడీ చిత్రం మీద అనుమానాలు ముసురుకుంటున్నాయి. దీని తర్వాత అనౌన్స్ చేసిన ‘సార్’ సినిమాను ధనుష్ చకచకా పూర్తి చేసేస్తున్నాడు.
తమిళంలో వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. కొత్తవీ అనౌన్స్ చేస్తున్నాడు. కానీ శేఖర్ కమ్ముల సినిమా గురించి అతను ఎక్కడా మాట్లాడట్లేదు. ఆ సినిమా గురించి దర్శక నిర్మాతలు కూడా మౌనం వహిస్తున్నారు. ఏ అప్డేట్ ఇవ్వట్లేదు. ‘లవ్ స్టోరి’ ఫలితం తేడా కొట్టడం, ధనుష్ ప్రయారిటీస్ మారిపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘లవ్ స్టోరి’ రిలీజై 11 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఇకనైనా శేఖర్ మౌనం వీడి తన కొత్త చిత్రం గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
This post was last modified on August 20, 2022 7:40 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…