తెలుగు సినీ చరిత్ర మొత్తంలో కమెడియన్గా బ్రహ్మానందం అందుకున్న స్థాయి అనితర సాధ్యమైనది. స్టార్ హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించాడాయన. తెరపై హీరోలు కనిపించినప్పటి కంటే బ్రహ్మానందం కనిపిస్తేనే థియేటర్లు ఎక్కువగా హోరెత్తే స్థాయిలో ఆయన ఒకప్పుడు క్రేజ్ సంపాదించారు.
ఒకప్పుడు బ్రహ్మి లేకుండా ఏ పెద్ద సినిమా ఉండేది కాదు. ఆయన కామెడీతోనే ఎన్నో సినిమాలు బ్లాక్బస్టర్లయ్యాయంటే అతిశయోక్తి కాదు. కాకపోతే ఎంతటి వాళ్లకైనా ఏదో ఒక సమయంలో క్రేజ్ తగ్గి అవకాశాలు ఆగిపోవడం సహజం. బ్రహ్మానందం కూడా అందుకు మినహాయింపు కాలేకపోయారు. వరుసగా ఆయన క్యారెక్టర్లు ఫెయిలవడం.. కామెడీ పండకపోవడం.. అవకాశాలు తగ్గిపోవడం.. ఇలా చూస్తుండగానే కథ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు ఏదైనా పెద్ద సినిమాలో బ్రహ్మి లేకపోతే ఆశ్చర్యపోయేవాళ్లం. కానీ ఇప్పుడు ఆయన ఏదైనా సినిమాలో ఉంటే ఆశ్చర్యం కలుగుతోంది.
చివరగా ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో రాములో రాములా పాటలో తళుక్కుమన్న బ్రహ్మి.. ఆ తర్వాత కనిపించలేదు. ఇకపై ఏ తెలుగు సినిమాలోనూ బ్రహ్మి కనిపించబోరని నిన్నట్నుంచి జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. బ్రహ్మి తనకు తానుగా ఇక సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. గత ఏడాదే బ్రహ్మి హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడాయన ఎక్కువ శ్రమ తీసుకునే పరిస్థితుల్లో లేరు. ఎవరినీ అవకాశాల కోసం అడిగే స్థాయి కాదు ఆయనది.
రచయితలు, దర్శకులు కూడా బ్రహ్మిని దృష్టిలో ఉంచుకుని పాత్రలు డిజైన్ చేయడం ఆపేశారు. ఈ నేపథ్యంలో గౌరవప్రదంగా తనే సినిమాల నుంచి తప్పుకోవాలని బ్రహ్మి నిర్ణయించుకున్నారట. ఐతే ఆయన టీవీలో మాత్రం ఓ ప్రత్యేక కార్యక్రమం ద్వారా అలరించబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. త్వరలోనే దాని గురించి ప్రకటన ఉంటుందట. ఐతే ఇకపై బ్రహ్మి నటించరేమో కానీ.. ఆల్రెడీ ఆయన కృష్ణవంశీ చిత్రం ‘రంగమార్తాండ’లో ఓ సీరియస్ పాత్ర చేశారు. బహుశా అదే ఆయన చివరి చిత్రం అవుతుందేమో.
This post was last modified on July 3, 2020 10:59 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…