సీనియర్ నిర్మాత అశ్వినీదత్ ఎంత ఔట్ స్పోకెనో అందరికీ తెలిసిందే. తన బేనర్కు భారీ విజయాలందించిన మెగాస్టార్ చిరంజీవిని సైతం ఆయన విమర్శించడానికి వెనుకాడలేదు ఆ మధ్య. ఇక చినజీయర్ స్వామి విషయంలో ఆయన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం అయ్యాయో తెలిసిందే. ఇటీవల టాలీవుడ్ స్ట్రైక్ గురించి కూడా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వెల్లడించి వార్తల్లో వ్యక్తి అయ్యారు దత్.
తాజాగా ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో పలు విషయాలపై దత్ తనదైన శైలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా మహానటి సినిమా ప్రస్తావన రాగా.. ఆ సినిమా ఎలా కార్యరూపం దాల్చిందో వివరించారు. ఈ క్రమంలో సావిత్రి పాత్రకు ముందు అనుకున్నది కీర్తి సురేష్ను కాదని ఆయన వెల్లడించారు. ముందు తాము ఎంచుకున్న నటితో వివాదం తలెత్తి ఆమెను తప్పించినట్లు వెల్లడించారు.
ఆ నటి ఎవరో చెప్పలేదు కానీ.. దత్ మాటల్ని బట్టి తనెవరో గెస్ చేయడం కష్టమేమీ కాదు. ఆమె ఒక మలయాళ నటి అని, తను సావిత్రి పాత్ర చేస్తే కచ్చితంగా న్యాయం చేసేదని, తనకు కూడా మంచి పేరు వచ్చేదని దత్ అభిప్రాయపడ్డారు. ఐతే కథా చర్చలు జరుగుతున్న సమయంలో సినిమాలో తాగుడు సీన్లు ఉంటే తాను చేయనని, వాటిని తీసేయాలని అల్టిమేటం విధించిందని.. ఈ విషయం తనకు తెలిసి స్క్రిప్టు మీద కామెంట్ చేయడానికి ఆమె ఎవరు అని ఆగ్రహించానని.. ఆమె ఈ సినిమా చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పానని.. దీంతో తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ కీర్తి సురేష్ను సంప్రదించాడని దత్ వెల్లడించారు.
సావిత్రి పాత్రకు కీర్తి అనగానే అందరూ ఆశ్చర్యపోయారని, ఆమె ఒక రకంగా సినిమాకు కొత్తదనం కూడా తీసుకొచ్చిందని, అద్భుతంగా నటించి మెప్పించిందని దత్ అన్నారు. దత్ మాటల్ని బట్టి మహానటిని వదులుకున్న నటి నిత్యా మీనన్ అని అర్థమైపోతుంది. ఆమెతో చిత్ర బృందం చర్చలు జరిపినట్లు, ఏవో కారణాల వల్ల తప్పుకున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
This post was last modified on August 18, 2022 5:37 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…