తన సినిమా ‘కార్తికేయ-2’ రిలీజ్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి యువ కథానాయకుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయి. జులై 22నే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ముందు నిర్ణయించగా.. అదే రోజు రిలీజ్కు రెడీ అయిన ‘థాంక్యూ’ కోసమని దిల్ రాజు తన సినిమాను వాయిదా వేయించాడనే అర్థం వచ్చేట్లుగా అతను మాట్లాడాడు. తర్వాత ఆగస్టు 5కు ఫిక్సయితే.. ఆ డేట్ నుంచి కూడా తమ సినిమాను ఖాళీ చేయించినట్లు నిఖిల్ తెలిపాడు.
బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్లే తనకీ సమస్యలని.. ‘కార్తికేయ-2’కు అసలు ఇప్పుడిప్పుడే థియేటర్లు దొరకడం కష్టమని, అక్టోబరుకు వాయిదా వేసుకోమని కొందరు సూచించినట్లు కూడా నిఖిల్ వెల్లడించాడు. అయినా తమ నిర్మాతలు పట్టుబట్టి ఆగస్టు 12న ‘కార్తికేయ-2’ను రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారని, ఈ విషయంలో తగ్గేదే లేదని అతను స్పష్టం చేశాడు ఆ ఇంటర్వ్యూలో. తీరా చూస్తే ఇప్పుడు ఆగస్టు 12న కూడా సినిమా రావట్లేదు.
ఒక రోజు ఆలస్యంగా 13కు ఆ చిత్రం షెడ్యూల్ అయింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సెలవు కావడంతో శుక్రవారం అడ్వాంటేజ్ కోల్పోయినా.. రెండు రోజుల వీకెండ్, ఒక రోజు సెలవు ప్లస్ అవుతాయని సర్దిచెప్పి సినిమాను ఒక రోజు వాయిదా వేయించినట్లు కనిపిస్తోంది. ఆగస్టు 12న రాబోతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ ఓపెనింగ్స్పై ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతోనే ఇలా చేయించారన్నది స్పష్టం.
ఐతే వరుసగా మూడు వారాంతాలకు షెడ్యూల్ అయిన సినిమాల నిర్మాతలు.. నిఖిల్ సినిమా తమ చిత్రాలకు పోటీ కాకూడదని అంత ఒత్తిడి తెచ్చి డేట్లు మార్పించారంటే ‘కార్తికేయ-2’ను చూసి వాళ్లు భయపడుతున్నట్లే లెక్క. ‘కార్తికేయ’ అప్పట్లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది.
దాని సీక్వెల్ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇన్ సైడ్ రిపోర్ట్స్ కూడా పాజిటివ్గా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా వల్ల తమ చిత్రాలకు డెంట్ తప్పదని ఆయా సినిమాల నిర్మాతలు భయపడి దీన్ని వాయిదా వేయించారని అర్థమవుతోంది. ఇలా మళ్లీ మళ్లీ డేట్ మార్చుకోవాల్సి రావడం ఇబ్బందికరమే అయినా.. తమ సినిమాను చూసి అందరూ భయపడడాన్ని ఒక రకంగా పాజిటివ్ సంకేతంగానే చూడాలి చిత్ర బృందం.
This post was last modified on August 3, 2022 4:22 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…