వెబ్ సిరీస్ కోసం ఇండియన్ ఓటిటి ప్లాటుఫార్మ్స్ బాగానే ఫండింగ్ చేస్తున్నాయి. ప్రాంతీయ భాషలకు ఇంకా గిరాకీ ఏర్పడలేదు కానీ హిందీ వెబ్ సిరీస్ ఇప్పటికే బాగా పాపులర్ అయిపోయాయి. దీంతో పేరున్న నటీనటులే వాటిలో నటిస్తున్నారు. మాధవన్ ప్రధాన పాత్ర పోషించిన అమెజాన్ సిరీస్ బ్రీత్ సీక్వెల్ లో అభిషేక్ బచ్చన్ ముఖ్య భూమిక పోషించాడు.
ఇందులో నిత్యా మీనన్ కూడా మెయిన్ క్యారెక్టర్ చేసింది. మిషన్ మంగళ్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నిత్య, ఇప్పుడీ సిరీస్ తో అక్కడ మరింత పాపులర్ కానుంది. ఈ సిరీస్ జులై 10 నుంచి అమెజాన్ లో స్ట్రీమ్ అవుతుంది. దీనిపై ఇప్పుడు చాలా బజ్ నెలకొంది. ట్రైలర్ కు చాలా వేగంగా లక్షల కొద్దీ వ్యూస్ రావడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అయింది. అంచనాలను అందుకుంటే ఇది కూడా ఈ లాక్ డౌన్లో వచ్చి క్లిక్ అయిన సిరీస్ సరసన చేరుతుంది.
This post was last modified on July 2, 2020 10:10 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…