మహానటితో మనముందుకొచ్చి కనులు కనులు దోచాయంటేతో బాగా దగ్గరైన దుల్కర్ సల్మాన్ సోలో హీరోగా నటించిన మొదటి టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ సీతా రామం. ఆగస్ట్ 5న విడుదల కాబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలేం లేవు కానీ వైజయంతి బ్యానర్. ఫీల్ గుడ్ మూవీస్ తీస్తాడనే పేరున్న హను రాఘవపూడి దర్శకుడు కావడం యూత్ పరంగా ఆకట్టుకునే అంశాలుగా కనిపిస్తున్నాయి. హైప్ ని పెంచే క్రమంలో అందరి దృష్టి ట్రైలర్ మీద ఉంది. ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ వేదికగా దీని లాంచ్ ఈవెంట్ జరిగింది.
ఎప్పుడో దశాబ్దాల క్రితం దొరికిన ఒక ప్రేమలేఖను మహాలక్ష్మి(మృణాల్ ఠాగూర్)కి చేరవేసే బాధ్యతను తీసుకుంటుంది అఫ్రీన్(రష్మిక మందన్న). తనకు కావాల్సిన మనిషికి ఇచ్చిన మాట కోసం. అది రాసిన రామ్(దుల్కర్ సల్మాన్)జాడ తెలియదు. ఉన్నాడో లేదో వివరాలు లేవు. అనాథ అయిన రామ్ కు అజ్ఞాతంలో ఉంటూ ఉత్తరాలు రాసే సీత నిజ జీవితంలో ఎలా కలుసుకుంది, ఇద్దరూ ఎందుకు విడిపోయారు, చివరి లెటర్ ఎందుకు చిరునామాకు అందకుండా ఆగిపోయింది లాంటి ప్రశ్నలకు సమాధానంగా సీతారామంని చూపించబోతున్నారు.
విజువల్స్ చాలా బాగున్నాయి. అప్పటి వాతావరణాన్ని పునఃసృష్టించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. క్యాస్టింగ్ కూడా గ్రాండ్ గా సెట్ చేసుకున్నారు.సుమంత్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, గౌతమ్ మీనన్ ఇలా లిస్టు పెద్దదే ఉంది. ప్రతి ఫ్రేమ్ లో హను రాఘవపూడి పొయెటిక్ సెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అసలే బాక్సాఫీస్ వద్ద అనిశ్చితి రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఇంత సున్నితమైన లవ్ స్టోరీని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. పైగా కళ్యాణ్ రామ్ బింబిసారతో పోటీ కూడా ఉంది
This post was last modified on July 25, 2022 4:08 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…