ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోల్లో నాగ చైతన్య ఒకడు. అక్కినేని కుటుంబం నుండి దిల్ రాజు బేనర్ లో ‘జోష్’ సినిమాతో చైతూ హీరోగా లాంచయిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ళ క్రితం జోష్ కథతో నాగార్జునని దిల్ రాజు అప్రోచ్ అవ్వడమే ఆలస్యం రాజు మీద ఉన్న నమ్మకంతో చైతు మొదటి సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ కి అప్పగించాడు. నిజానికి నాగార్జున తన సొంత బేనర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చైతుని లాంచ్ చేసి ఉండొచ్చు. కానీ అప్పట్లో దిల్ రాజు సక్సెస్ రేట్ చూసి నాగ్ ఆ డిసిషన్ తీసుకున్నాడు.
వాసు వర్మ దర్శకుడిగా పరిచయమైన జోష్ దర్శకుడిగా అతనికి హీరోగా చైతు కి సక్సెస్ అందించలేకపోయింది. కంటెంట్ ఫరవాలేదనిపించుకున్నప్పటికీ కొన్ని రీజన్స్ వల్ల కాస్టింగ్ కుదరకపోవడం వల్ల పెద్దగా ఆడలేదు. అప్పటి నుండి చైతూతో దిల్ రాజు సినిమా చేయలేదు. ఈ కాంబోలో దాదాపు పన్నెండేళ్ళ తర్వాత ఇప్పుడు ‘థాంక్యూ’ అనే సినిమా వస్తుంది.
దీంతో ఈసారి చైతు కి ఉన్న బాకీ ఉన్న హిట్ ఇచ్చి తనని నమ్మి అప్పట్లో అవకాశం ఇచ్చినందుకు అక్కినేని కుటుంబానికి ముఖ్యంగా నాగార్జునకి ఇప్పుడు థాంక్యూ చెప్పాలని చూస్తున్నాడు దిల్ రాజు. మరి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో చైతు కి కూడా హిట్ పడితే దిల్ రాజుకి నాగ్ కూడా థాంక్యూ చెప్తాడు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇక దిల్ రాజుని తన కొడుక్కి హిట్ ఇవ్వలేని నిర్మాతగా కాస్త దూరం పెట్టడం ఖాయం.
This post was last modified on July 19, 2022 4:48 pm
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…