ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోల్లో నాగ చైతన్య ఒకడు. అక్కినేని కుటుంబం నుండి దిల్ రాజు బేనర్ లో ‘జోష్’ సినిమాతో చైతూ హీరోగా లాంచయిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ళ క్రితం జోష్ కథతో నాగార్జునని దిల్ రాజు అప్రోచ్ అవ్వడమే ఆలస్యం రాజు మీద ఉన్న నమ్మకంతో చైతు మొదటి సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ కి అప్పగించాడు. నిజానికి నాగార్జున తన సొంత బేనర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చైతుని లాంచ్ చేసి ఉండొచ్చు. కానీ అప్పట్లో దిల్ రాజు సక్సెస్ రేట్ చూసి నాగ్ ఆ డిసిషన్ తీసుకున్నాడు.
వాసు వర్మ దర్శకుడిగా పరిచయమైన జోష్ దర్శకుడిగా అతనికి హీరోగా చైతు కి సక్సెస్ అందించలేకపోయింది. కంటెంట్ ఫరవాలేదనిపించుకున్నప్పటికీ కొన్ని రీజన్స్ వల్ల కాస్టింగ్ కుదరకపోవడం వల్ల పెద్దగా ఆడలేదు. అప్పటి నుండి చైతూతో దిల్ రాజు సినిమా చేయలేదు. ఈ కాంబోలో దాదాపు పన్నెండేళ్ళ తర్వాత ఇప్పుడు ‘థాంక్యూ’ అనే సినిమా వస్తుంది.
దీంతో ఈసారి చైతు కి ఉన్న బాకీ ఉన్న హిట్ ఇచ్చి తనని నమ్మి అప్పట్లో అవకాశం ఇచ్చినందుకు అక్కినేని కుటుంబానికి ముఖ్యంగా నాగార్జునకి ఇప్పుడు థాంక్యూ చెప్పాలని చూస్తున్నాడు దిల్ రాజు. మరి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో చైతు కి కూడా హిట్ పడితే దిల్ రాజుకి నాగ్ కూడా థాంక్యూ చెప్తాడు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇక దిల్ రాజుని తన కొడుక్కి హిట్ ఇవ్వలేని నిర్మాతగా కాస్త దూరం పెట్టడం ఖాయం.
This post was last modified on July 19, 2022 4:48 pm
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…
అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…
నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…