ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోల్లో నాగ చైతన్య ఒకడు. అక్కినేని కుటుంబం నుండి దిల్ రాజు బేనర్ లో ‘జోష్’ సినిమాతో చైతూ హీరోగా లాంచయిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ళ క్రితం జోష్ కథతో నాగార్జునని దిల్ రాజు అప్రోచ్ అవ్వడమే ఆలస్యం రాజు మీద ఉన్న నమ్మకంతో చైతు మొదటి సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ కి అప్పగించాడు. నిజానికి నాగార్జున తన సొంత బేనర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చైతుని లాంచ్ చేసి ఉండొచ్చు. కానీ అప్పట్లో దిల్ రాజు సక్సెస్ రేట్ చూసి నాగ్ ఆ డిసిషన్ తీసుకున్నాడు.
వాసు వర్మ దర్శకుడిగా పరిచయమైన జోష్ దర్శకుడిగా అతనికి హీరోగా చైతు కి సక్సెస్ అందించలేకపోయింది. కంటెంట్ ఫరవాలేదనిపించుకున్నప్పటికీ కొన్ని రీజన్స్ వల్ల కాస్టింగ్ కుదరకపోవడం వల్ల పెద్దగా ఆడలేదు. అప్పటి నుండి చైతూతో దిల్ రాజు సినిమా చేయలేదు. ఈ కాంబోలో దాదాపు పన్నెండేళ్ళ తర్వాత ఇప్పుడు ‘థాంక్యూ’ అనే సినిమా వస్తుంది.
దీంతో ఈసారి చైతు కి ఉన్న బాకీ ఉన్న హిట్ ఇచ్చి తనని నమ్మి అప్పట్లో అవకాశం ఇచ్చినందుకు అక్కినేని కుటుంబానికి ముఖ్యంగా నాగార్జునకి ఇప్పుడు థాంక్యూ చెప్పాలని చూస్తున్నాడు దిల్ రాజు. మరి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో చైతు కి కూడా హిట్ పడితే దిల్ రాజుకి నాగ్ కూడా థాంక్యూ చెప్తాడు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇక దిల్ రాజుని తన కొడుక్కి హిట్ ఇవ్వలేని నిర్మాతగా కాస్త దూరం పెట్టడం ఖాయం.
This post was last modified on July 19, 2022 4:48 pm
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…
దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి శుక్రవారంతో 10 మాసాలు గడిచాయి. గత ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి సర్కారుకొలువు…
హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…