ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోల్లో నాగ చైతన్య ఒకడు. అక్కినేని కుటుంబం నుండి దిల్ రాజు బేనర్ లో ‘జోష్’ సినిమాతో చైతూ హీరోగా లాంచయిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ళ క్రితం జోష్ కథతో నాగార్జునని దిల్ రాజు అప్రోచ్ అవ్వడమే ఆలస్యం రాజు మీద ఉన్న నమ్మకంతో చైతు మొదటి సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ కి అప్పగించాడు. నిజానికి నాగార్జున తన సొంత బేనర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చైతుని లాంచ్ చేసి ఉండొచ్చు. కానీ అప్పట్లో దిల్ రాజు సక్సెస్ రేట్ చూసి నాగ్ ఆ డిసిషన్ తీసుకున్నాడు.
వాసు వర్మ దర్శకుడిగా పరిచయమైన జోష్ దర్శకుడిగా అతనికి హీరోగా చైతు కి సక్సెస్ అందించలేకపోయింది. కంటెంట్ ఫరవాలేదనిపించుకున్నప్పటికీ కొన్ని రీజన్స్ వల్ల కాస్టింగ్ కుదరకపోవడం వల్ల పెద్దగా ఆడలేదు. అప్పటి నుండి చైతూతో దిల్ రాజు సినిమా చేయలేదు. ఈ కాంబోలో దాదాపు పన్నెండేళ్ళ తర్వాత ఇప్పుడు ‘థాంక్యూ’ అనే సినిమా వస్తుంది.
దీంతో ఈసారి చైతు కి ఉన్న బాకీ ఉన్న హిట్ ఇచ్చి తనని నమ్మి అప్పట్లో అవకాశం ఇచ్చినందుకు అక్కినేని కుటుంబానికి ముఖ్యంగా నాగార్జునకి ఇప్పుడు థాంక్యూ చెప్పాలని చూస్తున్నాడు దిల్ రాజు. మరి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో చైతు కి కూడా హిట్ పడితే దిల్ రాజుకి నాగ్ కూడా థాంక్యూ చెప్తాడు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇక దిల్ రాజుని తన కొడుక్కి హిట్ ఇవ్వలేని నిర్మాతగా కాస్త దూరం పెట్టడం ఖాయం.
This post was last modified on July 19, 2022 4:48 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…