గాల్వాన్ వ్యాలీ.. గత నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఎంతగానో చర్చనీయాంశమైన పదం. ఇండియా, చైనా సరిహద్దుల్లోని భారత భూభాగంలో ఉన్న ఈ లోయపై ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నించడం.. వారిని సైన్యాన్ని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టడం.. ఈ క్రమంలో చైనీయులు చేసిన దాడిలో మన సైనికులు కూడా 20 మంది ప్రాణాలు వదలడం.. చైనా అంతకు రెట్టింపు స్థాయిలో నష్టపోవడం తెలిసిన సంగతే.
ఓవైపు దేశమంతా కరోనాపై పోరాడుతుండగా.. సరిహద్దుల్లో ఇలాంటి ఘర్షణ చోటు చేసుకోవడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా గాల్వాన్ లోయ విశేషాలు.. అక్కడ సైన్యం మోహరించిన తీరు.. చుట్టుపక్కల పరిస్థితుల గురించి అనేక వార్తలొచ్చాయి. ఇండియా, చైనా మధ్య సాగిన చిన్నపాటి యుద్ధం గురించి కూడా ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి.
అవి చదువుతుంటే సినిమాలకు ఏమాత్రం తీసిపోని ఉత్కంఠ కనిపించింది. ఈ ఉత్కంఠను సినిమా రూపంలోకి తేవడానికి సన్నాహాలు మొదలైపోయాయి. ఐతే మామూలుగా ఇలా పెద్ద ఉదంతాలు జరిగినపుడు బాలీవుడ్ ఫిలిం మేకర్లు వెంటనే సినిమాలకు రంగం సిద్ధం చేస్తారు. ఐతే ఈసారి ఈ ప్రయత్నం మల్లూవుడ్లో జరుగుతోంది. ఒకప్పుడు ఆర్మీలో పని చేసి.. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి నటుడిగా, దర్శకుడిగా పేరు సంపాదించిన మేజర్ రవి.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో హీరోగా నటించనున్నాడు. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి ‘1971’ పేరుతో ఓ సినిమా చేశారు. అందులో మన అల్లు శిరీష్ కూడా ఓ కీలక పాత్ర చేశాడు. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది కానీ.. మేజర్ రవికి సైన్యం సంబంధిత అంశాలపై ఉన్న పట్టు ప్రశంసలందుకుంది. ఇప్పుడు ఆయన గాల్వన్ వ్యాలీ మీద మోహన్ లాల్ ప్రధాన పాత్రలో సినిమా తీయబోతున్నారనగానే ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
This post was last modified on July 1, 2020 6:07 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…