ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే కంగనా రనౌత్ తరహా ఇమేజ్, మార్కెట్ తెచ్చుకున్న కథానాయికలు చాలా అరుదుగా కనిపిస్తారు. ఆమె పేరు మీద ఒక సినిమాకు వంద కోట్ల బిజినెస్ జరిగే రేంజ్ రావడం అంటే మాటలు కాదు. క్వీన్, తను వెడ్స్ మను రిట్నర్స్, మణికర్ణిక లాంటి సినిమాలతో కొన్నేళ్ల ముందు వరకు ఆమె ఊపు మామూలుగా లేదు. కానీ ఈ ఇమేజ్, ఫాలోయింగ్ను ఆమె చేజేతులా దెబ్బ తీసుకుంది.
అందుకు కేవలం ఆమె తర్వాత చేసిన ఫ్లాప్ సినిమాలు మాత్రమే కారణం కాదు. అదే పనిగా బాలీవుడ్ ప్రముఖులందరినీ టార్గెట్ చేసి నోరు పారేసుకోవడం, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి భజన చేయడం జనాలకు నచ్చలేదు. ఏదైనా ఒక స్థాయి వరకు బాగానే ఉంటుంది కానీ.. శ్రుతి మించితేనే కష్టం. కొంచెం న్యూట్రల్గా కనిపిస్తూ ఒక పార్టీకి పరోక్షంగా సపోర్ట్ చేయడం వేరు. అలా కాకుండా అదే పనిగా భజన చేయడం, అవతలి పార్టీలను టార్గెట్ చేయడంతో జనాలకు చిర్రెత్తుకొచ్చింది.
కంగనా గత రెండేళ్లలో చేసిన అతికి ఆమె మీద జనాల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత వచ్చిందో ఇటీవల ‘ధకడ్’ సినిమా రిలీజైనపుడు అందరూ చూశారు. అది మరీ అంత పెద్ద డిజాస్టర్ అవ్వాల్సిన సినిమా అయితే కాదు. ఒకప్పుడు వంద కోట్ల వసూళ్లు వచ్చాయి కంగనా సినిమాలకు. కానీ ఈ చిత్రానికి ఫుల్ రన్లో ఐదు కోట్లు కూడా వసూలు కాలేదు. ఇదంతా కంగనా కోరి తెచ్చుకున్న నెగెటివిటీ పుణ్యమే. ఉన్న నెగెటివిటీ చాలదన్నట్లు ఇప్పుడామె ఎమర్జెన్సీ నేపథ్యంలో సినిమా చేయబోతోంది. ఇందులో కంగనా ఇందిరా గాంధీ పాత్ర చేయబోతుండటం గమనార్హం. అందుకోసం ఆమె కష్టపడి మేకోవర్ చేసుకుంది. ఈ చిత్రానికి కథ కూడా కంగనా రనౌతే అందించడం విశేషం. ఇది అందరినీ షాక్కు గురి చేస్తోంది.
పెద్ద హిస్టారియన్ లాగా ఆమె ఎమర్జెన్సీ మీద సినిమాకు కథ అందించడమేంటి అంటూ అప్పుడే కౌంటర్లు మొదలైపోయాయి. ఇది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని, ఇందిరను డీగ్రేడ్ చేసేలా ఉండే సినిమా అయి ఉంటుందని.. కొన్నేళ్లుగా మోడీ సర్కారు భజన చేస్తున్న కంగనా ఈ సినిమా చేస్తోంది కాబట్టి దీని విశ్వసనీయత మీద జనాలకు సందేహాలు నెలకొనడం ఖాయమని, ఇందులో నిజాలు చూపించినా కూడా దీన్నొక ప్రాపగండా ఫిలిం లాగే జనాలు చూడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.‘ధకడ్’తో తిన్న దెబ్బ సరిపోలేదని.. మరో షాక్కు కంగనా రెడీ అవుతోందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
This post was last modified on July 15, 2022 9:22 am
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…