బాలీవుడ్ స్టార్ల వైభోగం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. రణ్వీర్ సింగ్ – దీపికా పదుకునేల జంట తాజాగా కొన్న ఫ్లాట్ ఖరీదు అక్షరాల 119 కోట్లట. ఇప్పుడీ టాపిక్ సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది.
ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న బాంద్రాలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు నివసించే విల్లాల మధ్య రణ్వీర్ తన కొత్త ఫ్లాట్ ని కొనేసుకున్నాడు. వీళ్ళుండబోయే అపార్ట్మెంట్ పేరు సాగర్ రేశం. సింగల్ ఫ్లాట్ కి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారని బిజినెస్ వర్గాల టాక్.
ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి. పేరుకి అపార్ట్ మెంటే అయినప్పటికీ రణ్వీర్ దీపికలు ఉండబోయే ఫ్లాట్ మొత్తం నాలుగు ఫ్లోర్లలో విస్తరించి ఉంటుంది. 16 నుంచి 19 దాకా అనుసంధానం చేసి డబుల్ డ్యూప్లెక్స్ తరహాలో దీన్ని నిర్మించారు. సింపుల్ గా చెప్పాలంటే క్వాడ్రప్లెక్స్ అంటారు. 11 వేల 266 చదరపు అడుగులతో పాటు ప్రత్యేకంగా 1300 చ.అ టెర్రస్ కూడా ఉంటుంది. ఇందులో ఒక్క చ.అడుగు సుమారు 1 లక్షపైనే ఉంటుందట. స్టాంప్ డ్యూటీ కోసమే 7 కోట్ల 13 లక్షలు కట్టాల్సి రావడం దీని ప్రత్యేకత.
ఎప్పుడూ ట్రెండీగా ఆలోచించే రణ్వీర్ సింగ్ కు ఇదేమంత పెద్ద మొత్తం కాకపోవచ్చేమో కానీ వింటున్న వాళ్ళ గుండెలు మాత్రం అదురుతున్నాయి. మరి పార్కింగ్ స్లాట్ ఎలానే అనుమానం వస్తోందా. వీళ్ళు కొన్న ఫ్లాట్ కు గాను మొత్తం 19 కార్లు వాహనాలు నిలబెట్టుకునేందుకు చోటిచ్చారు.
రణ్వీర్ సింగ్ సర్కస్, రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానితో బిజీగా ఉండగా దీపికా మన ప్రభాస్ తో నటించబోయే ప్రాజెక్ట్ కెతో మొదటిసారి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అయినా వందల కోట్ల పారితోషికాలు తీసుకునే స్టార్ కపుల్ కి ఈ మాత్రం గ్రాండియర్ ఫ్లాట్ ఉండాల్సిందేనని అభిమానులు మురిసిపోతున్నారు.
This post was last modified on July 11, 2022 2:29 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…