టాలీవుడ్ లో సంక్రాంతి , దసరా సీజన్స్ లో విడుదలయ్యే సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు పండగలకు స్కూల్స్ , కాలేజీలు దాదాపు పది రోజుల పైనే సెలవలు ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీజన్ లో థియేటర్స్ కి ఎక్కువ వస్తారు. యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఈ సీజన్స్ లో బ్లాక్ బస్టర్స్ కొట్టేయొచ్చు. అందుకే ఈ పండుగలకు నెలల ముందే కర్చీపులు వేసేస్తారు స్టార్ హీరోలు.
అయితే ఈసారి ఈ రెండు పండుగల మీద మెగా కర్చీఫ్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ (వర్కింగ్ టైటిల్) ను వచ్చే సంక్రాంతి కి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని రోజులకే చిరు నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ రిలీజ్ డేట్ కూడా చెప్పేసి షాక్ ఇచ్చారు. చిరంజీవి , సల్మాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరా కి రిలీజ్ చేయబోతున్నారు.
ఇలా తెలుగులో రెండు పెద్ద పండగలకు మెగా స్టార్ ముందే కర్చీఫ్ వేసేసి మిగతా హీరోలకు చాన్స్ ఇవ్వకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకున్నారు. ఇటు దసరా సీజన్ తో పాటు అటు సంక్రాంతి సీజన్ లో కూడా రికార్డు కలెక్షన్స్ రాబట్టాలనేది మెగాస్టార్ మెగా స్కెచ్. మరి ఈ రెండు సినిమాల రిలీజ్ ఎనౌన్స్ మెంట్ తో విజయదసమి, మకర సంక్రాంతి ని మెగా ఫెస్టివల్స్ గా మార్చేసిన చిరు ఎలాంటి హిట్లు కొడతారో వేచి చూడాల్సిందే.
This post was last modified on July 6, 2022 2:27 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…