ఆచార్య చేదు జ్ఞాపకాల నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామాని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ చూపు ఇప్పుడు గాడ్ ఫాదర్ మీదే ఉంది. నిన్నటి నుంచి తెగ ఊరిస్తూ వచ్చిన ఫస్ట్ లుక్ ని ఇందాకా రిలీజ్ చేశారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో పోస్టర్ కొంచెం నిరాశ పరిచినా వీడియో టీజర్ మాత్రం అభిమానులకు మంచి కిక్ ఇచ్చేలా ఉంది. స్టైలిష్ కారులో వచ్చి సునీల్ డోర్ తీశాక మెగాస్టార్ కిందకు దిగి అలా నడుచుకుంటూ వచ్చే షాట్ ని ఇందులో రివీల్ చేశారు. ఎక్స్ పెక్ట్ చేసినట్టే తమన్ తన టెర్రిఫిక్ బిజిఎంతో చించేశాడు.
కాకపోతే ఒరిజినల్ వెర్షన్ లో ఇదే సీన్ పిక్చరైజేషన్ ఇంకోలా ఉంటుంది. హడావిడి లేకుండా మోహన్ లాల్ పోలీసులను దాటుకుని వచ్చే ఎపిసోడ్ ని హై ఇంటెన్సిటీతో షూట్ చేశారు. ఇందులోనూ ఆ డెప్త్ ఉంది కానీ చిరంజీవి ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని దర్శకుడు మోహన్ రాజా కాస్త కమర్షియల్ టచ్ ఎక్కువగా ఇచ్చారు. మొత్తానికి మ్యాటర్ ఉందనిపించేలా కట్ చేశారు కానీ ఇంకేదో కావలసిందనే ఫీలింగ్ ఫ్యాన్స్ మనసులో ఉండేలా చేశారు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడే అన్ని ఓపెన్ చేస్తే ఎలా అనే కామెంట్లు లేకపోలేదు.
గాడ్ ఫాదర్ రిలీజ్ ని విజయదశమిని లాక్ చేసేశారు. తెలివిగా డేట్ చెప్పలేదు. ఏజెంట్ కూడా అదే సీజన్ టార్గెట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక అండర్ స్టాండింగ్ కుదిరాక విడుదల తేదీకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రావొచ్చు. గాడ్ ఫాదర్ కు కలిసి రాబోయే అంశం మరొకటి ఉంది. రాబోయే ఆరేడు నెలల్లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలేవీ విడుదల కావడం లేదు. సో ఆ ఇద్దరి ఫ్యాన్స్ సపోర్ట్ కూడా పూర్తిగా ఈ మెగా మూవీకే దక్కుతుంది. మరి గాడ్ ఫాదర్ ఆచార్య గాయాన్ని మాన్పుతాడా. చూద్దాం.
This post was last modified on July 4, 2022 6:12 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…