కన్నడ నటి పవిత్ర లోకేష్తో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ బంధం గురించి కొన్ని రోజులుగా మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి తెలిసిందే. వీళ్లిద్దరూ కొన్నేళ్లుగా సన్నిహితంగా మెలుగుతున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారన్న చర్చ నడిచింది. కానీ ఇంతలో నరేష్ మూడో భార్య రమ్య సీన్లోకి వచ్చింది.
తనకు నరేష్ విడాకులు ఇవ్వకుండానే పవిత్రతో పెళ్లికి సిద్ధమవుతున్నాడని ఆమె మీడియాలో పెద్ద గొడవే చేసింది. ఆమె పవిత్ర స్వస్థలమైన బెంగళూరుకు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టడం.. ప్రతిగా నరేష్ కూడా మీడియాతో మాట్లాడుతూ రమ్య మీద తీవ్ర ఆరోపణలు చేయడం.. పవిత్ర సైతం మీడియాకు బైట్ ఇవ్వడం తెలిసిందే. కానీ రచ్చ అంతటితో ఆగలేదు. రెండు మూడు రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఓ సినిమా చిత్రీకరణ కోసమని మైసూరులోని ఓ హోటల్లో నరేష్, పవిత్ర బస చేస్తున్న హోటల్కు వెళ్లి రమ్య పెద్ద గొడవే చేసినట్లు తెలుస్తోంది.
ఈ గొడవకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో తిరుగుతోంది ఇప్పుడు. నరేష్, పవిత్ర హోటల్ గది నుంచి బయటికి వస్తుండగా.. రమ్య చెప్పు తీసుకుని వారిని కొట్టేందుకు ప్రయత్నించడం.. పోలీసులు అడ్డుకుని ఆమెను పక్కకు లాగేయడం, వెనుక కొందరు నినాదాలు చేయడం, నరేష్ వాళ్లను చూసి విజిల్స్ వేస్తూ లిఫ్టులోకి వెళ్లడం, ఆయన్ని పవిత్ర అనుసరించడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
నరేష్-పవిత్ర అక్కడ బస చేస్తున్నట్లు రమ్యకు ఎలా తెలిసిందన్నది అర్థం కాని విషయం. ఆమె తన అనుచరులతో కలిసి పెద్ద గొడవ చేయగా.. నరేష్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను అక్కడి నుంచి పంపించినట్లు తెలుస్తోంది.
నరేష్, రమ్య గత కొన్ని రోజుల్లో ఒకరి గురించి ఒకరు తీవ్ర ఆరోపణలే చేసుకున్నారు. పవిత్రను పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా తన నుంచి విడాకుల కోసం నరేష్ గన్నుతో బెదిరించారని రమ్య ఆరోపిస్తే.. రమ్య తనతో ఎప్పుడూ సక్రమంగా కాపురం చేసింది లేదని, ఆమె ఒక డ్రైవర్తో సంబంధం పెట్టుకుందని నరేష్ ఎదురు దాడి చేశారు.
This post was last modified on July 3, 2022 4:20 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…