‘ఊహలు గుసగుసలాడే’ అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయమై.. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది ఢిల్లీ భామ రాశి ఖన్నా. ఇప్పుడు ఆమెను ఎవ్వరూ పరభాషా కథానాయికగా చూడట్లేదు. ఓ తెలుగమ్మాయిలాగే భావిస్తున్నారు. అంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది. తెలుగు గడ్డే అయిన హైదరాబాద్లో ఓ ఇల్లు కూడా కొనుక్కుంది. ఆమె ఇప్పటిదాకా ఎక్కువగా చేసింది తెలుగు సినిమాలే అన్న సంగతీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా.. త్వరలోనే ‘థ్యాంక్ యు’తో పలకరించబోతోంది రాశి.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులతో తన అనుబంధం గురించి పంచుకుంది. తాను ఢిల్లీ అమ్మాయిని అయినా.. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగానో ఓన్ చేసుకున్నారని ఆమె అంది. రాజమండ్రిలో ‘ప్రతి రోజు పండగే’ చిత్రం కోసం షూటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని వచ్చి ఆటోగ్రాఫ్ అడిగాడని, తాను ఆటోగ్రాఫ్ చేయగా.. దాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడని.. ఆ క్షణం తనకు ఎంతో ఆనందం కలిగిందని, ఇలాంటి అభిమానులు ఉండడం తన అదృష్టమని రాశి పేర్కొంది.
తన తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’లో తాను చేసిన ప్రభావతి పాత్ర తనకెంతో ఇష్టమని.. ఆ తర్వాత అంతగా ఇష్టపడ్డ పాత్ర ‘వరల్డ్ ఫేమస్ లవర్’లోని యామినినే అని రాశి పేర్కొంది. కానీ తాను అంతగా ఇష్టపడ్డ పాత్ర ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదని.. ఆ సినిమా రిలీజైనపుడు అందరూ తనను ట్రోల్ చేశారని రాశి పేర్కొంది. ఆ చిత్రంలో రాశి కొన్ని బోల్డ్ సీన్స్ చేయడంపై అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ముందు నుంచి హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు ఉండడంతో ఆ బోల్డ్ సీన్లు చేయడం అభిమానులకు రుచించకపోయి ఉండొచ్చు. తనకు కాబోయే భర్త దైవ భక్తి ఎక్కువ ఉన్నవాడు, మంచి వాడు అయ్యుండాలని ఈ ఇంటర్వ్యూలో రాశి పేర్కొనడం విశేషం.
This post was last modified on July 2, 2022 6:05 pm
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…