‘ఊహలు గుసగుసలాడే’ అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయమై.. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది ఢిల్లీ భామ రాశి ఖన్నా. ఇప్పుడు ఆమెను ఎవ్వరూ పరభాషా కథానాయికగా చూడట్లేదు. ఓ తెలుగమ్మాయిలాగే భావిస్తున్నారు. అంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది. తెలుగు గడ్డే అయిన హైదరాబాద్లో ఓ ఇల్లు కూడా కొనుక్కుంది. ఆమె ఇప్పటిదాకా ఎక్కువగా చేసింది తెలుగు సినిమాలే అన్న సంగతీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా.. త్వరలోనే ‘థ్యాంక్ యు’తో పలకరించబోతోంది రాశి.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులతో తన అనుబంధం గురించి పంచుకుంది. తాను ఢిల్లీ అమ్మాయిని అయినా.. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగానో ఓన్ చేసుకున్నారని ఆమె అంది. రాజమండ్రిలో ‘ప్రతి రోజు పండగే’ చిత్రం కోసం షూటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని వచ్చి ఆటోగ్రాఫ్ అడిగాడని, తాను ఆటోగ్రాఫ్ చేయగా.. దాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడని.. ఆ క్షణం తనకు ఎంతో ఆనందం కలిగిందని, ఇలాంటి అభిమానులు ఉండడం తన అదృష్టమని రాశి పేర్కొంది.
తన తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’లో తాను చేసిన ప్రభావతి పాత్ర తనకెంతో ఇష్టమని.. ఆ తర్వాత అంతగా ఇష్టపడ్డ పాత్ర ‘వరల్డ్ ఫేమస్ లవర్’లోని యామినినే అని రాశి పేర్కొంది. కానీ తాను అంతగా ఇష్టపడ్డ పాత్ర ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదని.. ఆ సినిమా రిలీజైనపుడు అందరూ తనను ట్రోల్ చేశారని రాశి పేర్కొంది. ఆ చిత్రంలో రాశి కొన్ని బోల్డ్ సీన్స్ చేయడంపై అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ముందు నుంచి హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు ఉండడంతో ఆ బోల్డ్ సీన్లు చేయడం అభిమానులకు రుచించకపోయి ఉండొచ్చు. తనకు కాబోయే భర్త దైవ భక్తి ఎక్కువ ఉన్నవాడు, మంచి వాడు అయ్యుండాలని ఈ ఇంటర్వ్యూలో రాశి పేర్కొనడం విశేషం.
This post was last modified on July 2, 2022 6:05 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…