‘ఊహలు గుసగుసలాడే’ అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయమై.. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది ఢిల్లీ భామ రాశి ఖన్నా. ఇప్పుడు ఆమెను ఎవ్వరూ పరభాషా కథానాయికగా చూడట్లేదు. ఓ తెలుగమ్మాయిలాగే భావిస్తున్నారు. అంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది. తెలుగు గడ్డే అయిన హైదరాబాద్లో ఓ ఇల్లు కూడా కొనుక్కుంది. ఆమె ఇప్పటిదాకా ఎక్కువగా చేసింది తెలుగు సినిమాలే అన్న సంగతీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా.. త్వరలోనే ‘థ్యాంక్ యు’తో పలకరించబోతోంది రాశి.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులతో తన అనుబంధం గురించి పంచుకుంది. తాను ఢిల్లీ అమ్మాయిని అయినా.. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగానో ఓన్ చేసుకున్నారని ఆమె అంది. రాజమండ్రిలో ‘ప్రతి రోజు పండగే’ చిత్రం కోసం షూటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని వచ్చి ఆటోగ్రాఫ్ అడిగాడని, తాను ఆటోగ్రాఫ్ చేయగా.. దాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడని.. ఆ క్షణం తనకు ఎంతో ఆనందం కలిగిందని, ఇలాంటి అభిమానులు ఉండడం తన అదృష్టమని రాశి పేర్కొంది.
తన తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’లో తాను చేసిన ప్రభావతి పాత్ర తనకెంతో ఇష్టమని.. ఆ తర్వాత అంతగా ఇష్టపడ్డ పాత్ర ‘వరల్డ్ ఫేమస్ లవర్’లోని యామినినే అని రాశి పేర్కొంది. కానీ తాను అంతగా ఇష్టపడ్డ పాత్ర ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదని.. ఆ సినిమా రిలీజైనపుడు అందరూ తనను ట్రోల్ చేశారని రాశి పేర్కొంది. ఆ చిత్రంలో రాశి కొన్ని బోల్డ్ సీన్స్ చేయడంపై అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ముందు నుంచి హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు ఉండడంతో ఆ బోల్డ్ సీన్లు చేయడం అభిమానులకు రుచించకపోయి ఉండొచ్చు. తనకు కాబోయే భర్త దైవ భక్తి ఎక్కువ ఉన్నవాడు, మంచి వాడు అయ్యుండాలని ఈ ఇంటర్వ్యూలో రాశి పేర్కొనడం విశేషం.
This post was last modified on July 2, 2022 6:05 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…