Movie News

సుడల్ వెబ్ సిరీస్ ఎలా ఉంది

ఒక సౌత్ ఇండియన్ వెబ్ సిరీస్ కి అమెజాన్ ప్రైమ్ భారీ పబ్లిసిటీ చేయడం సుడల్ విషయంలోనే జరిగింది. రెండు మూడు వారాలుగా దీని గురించి సోషల్ మీడియాలోనూ హల్చల్ జరుగుతోంది. తెలుగు ఆర్టిస్టులు లేకపోయినా ఐశ్వర్య రాజేష్, పార్తీబన్ లాంటి కొందరు తెలిసున్న క్యాస్టింగ్ ఉండటంతో పాటు ట్రైలర్ ని ఆసక్తికరంగా కట్ చేయడం వల్ల ఓటిటి ఆడియన్స్ కి దీని మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ విక్రమ్ వేదా దర్శకులు పుష్కర్ గాయత్రిలు రచన చేసి పర్యవేక్షించిన సిరీస్ కావడంతో ఆసక్తి పెరిగింది.

ఇది తమిళనాడు ఓ హిల్ స్టేషన్ ఉండే చిన్న పట్టణంలో జరిగే కథ. 30 ఏళ్ళ చరిత్ర ఉన్న ఒక సిమెంట్ ఫ్యాక్టరీ రాత్రికి రాత్రి తగలబడి పోతుంది. సరిగ్గా అదే సమయంలో కార్మిక నాయకుడు షణ్ముగం(పార్తీబన్)చిన్న కూతురు నీల మాయమవుతుంది. తండ్రికి కుటుంబానికి దూరంగా కోయంబత్తూర్ లో ఉండే నీల అక్క(ఐశ్వర్య రాజేష్)చెల్లెలి కోసం తిరిగి వస్తుంది. స్థానిక ఇన్స్ పెక్టర్(కథిర్)సహాయంతో వేట మొదలుపెడుతుంది. ఈ కిడ్నాప్ కి పోలీస్ అధికారి(శ్రేయా రెడ్డి)కొడుకు కనిపించకుండా పోవడానికి లింక్ ఉంటుంది. దానికి తోడు అక్కడ ఘనంగా జరిగే అమ్మవారి జాతరలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఆపై నడిచేదే అసలు స్టోరీ.

ఎనిమిది ఎపిసోడ్లు అన్నీ కలిపి సుమారు ఆరున్నర గంటల నిడివి ఉన్న సుడల్ ఈ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులకు ఓ మోస్తరుగా నచ్చుతుంది. వెబ్ సిరీస్ కాబట్టి ల్యాగ్ ఉన్నప్పటికీ బలమైన క్యాస్టింగ్, కీలకమైన మలుపులను హ్యాండిల్ చేసిన విధానం మరీ విసుగు రాకుండా చేసింది. కాకపోతే సబ్జెక్టులో కొత్తదనం లేకపోయినా టేకింగ్, లొకేషన్లు ఫ్రెష్ గా అనిపిస్తాయి. విశాల్ పొగరులో విలన్ గా కనిపించిన శ్రేయా రెడ్డి ఇంత గ్యాప్ తర్వాత కూడా అదరగొట్టేశారు. పార్తీబన్, కథిర్ ల పెర్ఫార్మన్స్ దన్నుగా నిలిచింది. ఐశ్వర్యరాజేష్ కు పెద్దగా స్కోప్ దక్కలేదు. అసలు ట్విస్ట్ అంతగా కిక్ ఇవ్వలేకపోయింది. బ్రహ్మ-అనుచరణ్ ల జంట దర్శకత్వం పర్లేదు.

This post was last modified on June 18, 2022 12:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

23 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago