అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పట్టి అక్కడ భారీ విజయం అందించారు. ఇప్పటికే బాలీవుడ్ నుండి పుష్ప కి చాలా ప్రశంసలు దక్కాయి. చాలా మంది సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా పుష్ప మేనరిజంతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు. అయితే తాజాగా ఈ సినిమాకు మరో ప్రశంస దక్కింది.
అయితే ఈసారి పుష్పకి వచ్చిన ప్రశంస ఆషామాషీ వ్యక్తి నుండి కాదు. షారుక్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సైతం ఆయనతో సినిమా చేయడం కోసం ఇరవై ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్న బాలీవుడ్ బడా దర్శకుడు రాజ్ కుమార్ హిరాని నుండి పుష్ప కి కాంప్లిమెంట్స్ దక్కాయి.
ఇటివలే ‘పుష్ప’ చూసిన రాజ్ కుమార్ హిరాని సుకుమార్ కి మెసేజ్ పెట్టి పుష్ప రైటింగ్ , సన్నివేశాల గురించి అలాగే మ్యూజిక్ గురించి అభినందనలు తెలిపాడు. సినిమా చూడగానే చెప్పాలనుకున్నాను కానీ మీ నంబర్ దొరకలేదు. ఈ సినిమా గురించి చాలా మందితో మాట్లాడాను. ఇప్పుడే మీ నంబర్ దొరికింది అంటూ సుక్కు కి పెర్సనల్ మెసేజ్ పెట్టారు రాజు హిరాని. ఇక బాలీవుడ్ బిగ్ డైరెక్టర్ నుండి ఇంత గొప్ప ప్రశంస రావడంతో సుక్కు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. కాస్త ఆలస్యంగా మీ మెసేజ్ చూశాను. మీ నుండి టెక్స్ట్ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది మీ రైటింగ్ , మేకింగ్ నాకు ఆదర్శం అంటూ రిప్లై ఇచ్చాడు.
రాజ్ కుమార్ హిరాని , సుక్కు కన్వర్సేషణ్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడు సుకుమార్. ఆగస్ట్ నుండి షూటింగ్ మొదలు కానుంది.
This post was last modified on June 11, 2022 8:22 am
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…