అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పట్టి అక్కడ భారీ విజయం అందించారు. ఇప్పటికే బాలీవుడ్ నుండి పుష్ప కి చాలా ప్రశంసలు దక్కాయి. చాలా మంది సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా పుష్ప మేనరిజంతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు. అయితే తాజాగా ఈ సినిమాకు మరో ప్రశంస దక్కింది.
అయితే ఈసారి పుష్పకి వచ్చిన ప్రశంస ఆషామాషీ వ్యక్తి నుండి కాదు. షారుక్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సైతం ఆయనతో సినిమా చేయడం కోసం ఇరవై ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్న బాలీవుడ్ బడా దర్శకుడు రాజ్ కుమార్ హిరాని నుండి పుష్ప కి కాంప్లిమెంట్స్ దక్కాయి.
ఇటివలే ‘పుష్ప’ చూసిన రాజ్ కుమార్ హిరాని సుకుమార్ కి మెసేజ్ పెట్టి పుష్ప రైటింగ్ , సన్నివేశాల గురించి అలాగే మ్యూజిక్ గురించి అభినందనలు తెలిపాడు. సినిమా చూడగానే చెప్పాలనుకున్నాను కానీ మీ నంబర్ దొరకలేదు. ఈ సినిమా గురించి చాలా మందితో మాట్లాడాను. ఇప్పుడే మీ నంబర్ దొరికింది అంటూ సుక్కు కి పెర్సనల్ మెసేజ్ పెట్టారు రాజు హిరాని. ఇక బాలీవుడ్ బిగ్ డైరెక్టర్ నుండి ఇంత గొప్ప ప్రశంస రావడంతో సుక్కు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. కాస్త ఆలస్యంగా మీ మెసేజ్ చూశాను. మీ నుండి టెక్స్ట్ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది మీ రైటింగ్ , మేకింగ్ నాకు ఆదర్శం అంటూ రిప్లై ఇచ్చాడు.
రాజ్ కుమార్ హిరాని , సుక్కు కన్వర్సేషణ్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడు సుకుమార్. ఆగస్ట్ నుండి షూటింగ్ మొదలు కానుంది.
This post was last modified on June 11, 2022 8:22 am
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఎంత అవసరమో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయనను…
మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు.…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…