కొన్ని సినిమాలు స్క్రిప్టింగ్ లోనే ఆగిపోతుంటాయి. మరికొన్ని రెడీ టు షూట్ అనే స్టేజిలో ఉండగా క్యాన్సెల్ అవుతాయి. ఆ లిస్టులో యంగ్ హీరో నితిన్ సినిమా కూడా ఒకటుంది. అవును ‘పవర్ పేట’ అనే టైటిల్ తో సొంతం బేనర్ లో సినిమా చేయాలనుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ కి కృష్ణ చైతన్య దర్శకుడు. సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించి రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనే ప్లాన్ కూడా వేశారు. నితిన్ తో పాటు మరో ఇంపార్టెంట్ రోల్ కోసం సత్య దేవ్ ని తీసుకున్నారు.
అంతా రెడీ షూట్ కి వెళ్ళడమే ఆలస్యం అనేలోపు సినిమా ఆగిపోయింది. అప్పటి నుండి ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేదు. అసలు త్వరలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందా ? లేక పూర్తిగా క్యాన్సెల్ అయినట్టేనా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఆ సందేహాలకు తాజాగా సమాధానం ఇచ్చారు నితిన్ తండ్రి నిర్మాత సుధాకర్ రెడ్డి. ఆ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఫైనల్ వర్షన్ సరిగ్గా రాలేదు. అందుకే దాన్ని పక్కన పెట్టాం. ఆ ప్రాజెక్ట్ ఇక లేనట్టే అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక విక్రమ్ ని తెలుగులో రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని , ఈ సినిమా కోసం చాలా మంది పోటీ పడినప్పటికీ డిస్ట్రిబ్యూషన్ లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నందు వల్లే కమల్ గారు తనకి ఈ అవకాశం ఇచ్చారని పేర్కొన్నాడు. తక్కువ రేటుకే రైట్స్ ఇచ్చారని చెప్పుకున్నారు సుధాకర్ రెడ్డి. ఇక విక్రమ్ సక్సెస్ తర్వాత చాలా మంది తనకి కాల్ చేసి స్పెషల్ షో కోసం అడుగుతున్నారని చాలా మంది పెర్సనల్ గా చూశారని తెలిపాడు.
ఇక విక్రమ్ సీక్వెల్ రైట్స్ కూడా తనకే ఇవ్వనున్నారని విజయ్ తో లోకేష్ సినిమా అవ్వగానే సీక్వెల్ ఉంటుందని దాన్ని మరింత గ్రాండియర్ గా ప్లాన్ చేస్తున్నారని అన్నారు. ఇక నితిన్ మాచర్ల నియోజిక వర్గం షూటింగ్ 80 % కంప్లీట్ అయ్యిందని ఆగస్టులో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. అలాగే వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న సినిమాకు సంబంధించి ఓ సాంగ్ షూట్ చేశామని అది వచ్చే ఏడాది రిలీజ్ ఉంటుందని చెప్పారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…