గత ఏడాది పెద్దన్న రూపంలో పెద్ద డిజాస్టర్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ తన 169వ సినిమాకు రెడీ అవుతున్నారు. డాక్టర్ తో బ్లాక్ బస్టర్ అందుకుని బీస్ట్ తో షాక్ తిన్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఆగస్ట్ నుంచి ప్రారంభించబోతున్నారు. ఇందులో చాలా విశేషాలున్నాయి. అందులో మొదటిది పన్నెండేళ్ల తర్వాత అందాల సుందరి ఐశ్యర్యరాయ్ రజనీకాంత్ తో జోడి కట్టనుంది.
రోబో బ్లాక్ బస్టర్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించే అవకాశం దక్కలేదు. అందులోనూ ఐష్ పెళ్లి చేసుకున్నాక నటనకు బ్రేక్ తీసుకోవడంతో మనవాళ్లకు అందుబాటులో లేకుండా పోయారు. ఇందులో రజినికి భార్యగా కనిపించబోతున్నట్టు చెన్నై టాక్. అంతే కాదు రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర చేస్తున్నారు.
నరసింహలో నీలాంబరి టైపు పవర్ ఫుల్ క్యారెక్టరా లేక ఇంకేదయినా ప్రత్యేకంగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సూపర్ స్టారే స్వయంగా కథను సమకూర్చుకోగా ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ స్క్రీన్ ప్లే అందించారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఇది రూపొందనుంది.
అంతే కాదు ఈ మధ్య కాలంలో కోలీవుడ్ లో మంచి హిట్లు కొడుతున్న ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తనకు జోడిగా ఉండే యువనటుడు ఎవరో తెలియాల్సి ఉంది. కన్నడ సీనియర్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. సంగీతం అనిరుద్ రవిచందర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ప్రీ ప్రొడక్షన్ స్టేజిలోనే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయేలా చేస్తున్న ఈ సినిమాను తలైవా కెరీర్ బెస్ట్ లో ఒకటిగా నిలుపుతానని నెల్సన్ హామీ ఇస్తున్నాడు. అభిమానులు కోరుకుంటున్నది కూడా అదే.
This post was last modified on June 7, 2022 2:52 pm
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. తరచుగా కూటమి సర్కారు సహా.. పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు.. తాజాగా…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి శనివారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలైంది. ఉన్నట్లుండి…
తెలుగులో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ‘మసూద’…
మరో కొత్త రికార్డు బద్దలైపోయింది. మొన్నటి ఏడాది రిలీజైన పుష్ప 2 ది రైజ్ వసూళ్లను ఇప్పుడప్పుడే ఎవరూ క్రాస్…
దేశంలో సుదీర్ఘకాలంగా ఎలాంటి పెంపునకు గురి కాకుండా ఉండిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తెర మీదకు రాగా... కాంగ్రెస్…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీపై వరాల జల్లు కురిపించింది. శనివారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘ…