స్టార్ హీరోలు లెక్చరర్ గా చేసిన పాత్రలు వాళ్లకు సూపర్ హిట్లు అందించిన దాఖలాలు చాలా ఉన్నాయి. వెంకటేష్ సుందరకాండ మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సింహాలో ఫస్ట్ హాఫ్ బాలయ్య చేసింది పాఠాలు చెప్పే ఉద్యోగమే. మిరపకాయ్ లో రవితేజ పండించిన కామెడీని మర్చిపోగలమా. మెగా ఫ్యాన్స్ విషయానికి వస్తే కాలేజీ బ్యాక్ డ్రాప్ అనగానే మొదట గుర్తొచ్చే మూవీ మాస్టర్. 1997 సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్. సరికొత్త చిరుని చూసి అభిమానులు పులకరించిపోయారు.
ఇప్పుడు పవర్ స్టార్ వంతు వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే భవదీయుడు భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ అధ్యాపకుడిగా కనిపిస్తారట. ఆ మేరకు దర్శకుడే ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇప్పుడీ సంగతి సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఈ పాత్ర భగత్ సింగ్ భావజాలంతో ఆయనకు వీరభక్తుడిగా కనిపిస్తుందని టాక్. అందుకే టైటిల్ కూడా అలా పెట్టారని వినికిడి. ఇన్నేళ్ల కెరీర్ లో పవన్ స్టూడెంట్ గా దర్శనమిచ్చాడు కానీ లెక్చరర్ గా ఎప్పుడూ కనిపించలేదు.
మొత్తానికి ఇది ఫ్యాన్స్ కి స్పెషల్ న్యూస్ గా చెప్పొచ్చు. జూలై లేదా ఆగస్ట్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్న భవదీయుడు భగత్ సింగ్ విడుదలయ్యేది మాత్రం 2023లోనే. దానికన్నా ముందు హరిహర వీరమల్లు వస్తుంది. వినోదయ సితం రీమేక్ ని తక్కువ కాల్ షీట్స్ తో పూర్తి చేసేలా ఆల్రెడీ ప్లానింగ్ అయ్యింది. సో హరీష్ శంకర్ కి ఇంకొంత వెయిటింగ్ టైం తప్పక పోవచ్చు. గబ్బర్ సింగ్ లాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడంతో ప్రకటన స్టేజి నుంచే దీని మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.
This post was last modified on May 21, 2022 6:48 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…