సూపర్ స్టార్ మహేష్ బాబు యధాలాపంగా అన్న ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్కు ఎప్పుడు వెళ్తారు అంటూ మహేష్ ఎప్పుడు మీడియాను కలిసినా విలేకరులు అడిగే ప్రశ్ననే సర్కారు వారి పాట ప్రమోషన్లలోనూ అడిగారు. దానికి మహేష్ ఎప్పట్లా రొటీన్ సమాధానం చెప్పకుండా.. బాలీవుడ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అక్కడి వాళ్లు నన్ను భరించలేరు అన్నట్లుగా జవాబివ్వడం చర్చనీయాంశం అయింది.
అసలే నార్త్ మార్కెట్లో సౌత్ సినిమాల దూకుడుతో బాలీవుడ్ వాళ్లు మంటెత్తిపోతున్నారు. అది చాలదన్నట్లు సుదీప్ లాంటి వాళ్లు బాలీవుడ్ వాళ్లను గిచ్చుతున్నారు. ఇలాంటి టైంలో మహేష్ కూడా ఇలా కామెంట్ చేయడం బాలీవుడ్ జనాలకు, అక్కడి మీడియా వాళ్లకు రుచించినట్లు లేదు. సెలబ్రెటీలెవరూ నేరుగా స్పందించకపోయినా.. అక్కడి మీడియా వాళ్లు మాత్రం మహేష్ మీద నెగెటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఐతే ఎంతైనా నార్త్ మార్కెట్ చాలా పెద్దది. బాలీవుడ్కూ ఒక స్థాయి ఉంది.
అందులోనూ రేప్పొద్దున రాజమౌళితో సినిమా చేశాక అది పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజవుతుంది. అప్పుడు ప్రమోషన్ల కోసం ఉత్తరాదిన అంతా తిరగాలి. ఇప్పటి మాటలు అప్పుడు ఇబ్బందిగా మారతాయేమో అని మహేష్ అండ్ కో భయపడ్డట్లుంది. అందుకే డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారు.
‘‘మహేష్కు అన్ని భాషల సినిమాలపై గౌరవం ఉంది.. అన్ని భాషలూ, అన్ని ఇండస్ట్రీలూ ఆయనకు సమానమే. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు సినిమాలు చేస్తుండటం వల్ల ఇవి అయితే తనకు సౌకర్యవంతంగా ఉంటాయని మాత్రమే ఆయన చెప్పారు. ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు’’.. అంటూ వివరణ ఇచ్చింది మహేష్ పీఆర్ టీం. రాజమౌళితో మహేష్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజవబోతోందని కూడా ఈ టీం ప్రస్తావించడాన్ని బట్టి దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ డ్యామేజ్ కంట్రోల్ అన్నది స్పష్టం.
This post was last modified on May 12, 2022 6:04 am
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…