సుబ్బలక్ష్మి అని తమిళనాడులో మంచి పాపులారిటీ ఉన్న అమ్మాయి. ఆమెకు ఆ పాపులారిటీ తెచ్చింది టిక్ టాక్. అందులో ‘రౌడీ బేబీ’ పేరుతో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిందా అమ్మాయి. రౌడీ బేబీ అనగానే ధనుష్, సాయిపల్లవి డ్యాన్స్ అదరగొట్టిన పాటే కాదు.. ఈ అమ్మాయి కూడా గుర్తుకొస్తుంది తమిళ జనాలకు. అంతగా టిక్ టాక్తో ఆమె పాపులర్. ఐతే ఈ అమ్మాయి ఇటీవల ఒక రాంగ్ న్యూస్తో వార్తల్లో నిలిచింది.
ఈ మధ్యే సుబ్బులక్ష్మి సింగపూర్కు వెళ్లి వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లందరూ తమ ఆరోగ్య స్థితిని ప్రభుత్వానికి తెలియజేయడం, కరోనా పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి. కానీ సుబ్బులక్ష్మి ఆ పని చేయలేదు. ఐతే స్థానికులు ఈ విషయం గుర్తించి అధికారులు ఫిర్యాదు చేశారు. వాళ్లొచ్చి ఆమెను కరోనా పరీక్షల కోసం బలవంతంగా తీసుకెళ్లారు.
ఐతే పరీక్షా కేంద్రం దగ్గరికి వెళ్లాక సుబ్బులక్ష్మి మామూలు హంగామా చేయలేదు. నేనెవరో.. నా పాపులారిటీ ఏంటో తెలుసా.. పరీక్ష చేయడానికి ఏసీ గది దొరకలేదా.. నన్ను మామూలు గదిలో పెడతారా అంటూ అధికారులపై విరుచుకుపడింది. దీన్నంతా వీడియోలో రికార్డ్ చేయబోతున్న విలేకరిని బూతులు తిట్టింది. అతను సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాదు.. ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు కూడా. దీంతో సుబ్బులక్ష్మి బాగా అన్పాపులర్ అయింది. అందరూ ఆమెను తిట్టుకున్నారు.
ఇంతకుముందు సుబ్బులక్ష్మి చేసిన టిక్టాక్ వీడియోలు హల్చల్ చేసేవి. కానీ ఇప్పుడు ఆమె కరోనా టెస్ట్ సెంటర్లో చేసిన హంగామాకు సంబంధించిన వీడియో టిక్టాక్లో వైరల్ అయింది. అందరూ ఆమెను తిట్టడం, కామెడీ చేయడం మొదలుపెట్టారు. దీంతో సుబ్బులక్ష్మి బాగా హర్టయింది. ప్రాణాలే తీసుకోవాలనుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోతుంటే ఎవరో చూసి కాపాడారు. ఆసుపత్రికి తరలించారు. దీంతో సుబ్బులక్ష్మి మరోసారి వార్తల్లోకెక్కింది. టిక్టాక్ పాపులారిటీ చూసుకుని ఏదో ఊహించుకుని అతి చేయొద్దనడానికి ఈ ఉదంతం ఉదాహరణ.
This post was last modified on June 24, 2020 10:39 am
కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్ అల్లుడిగా ఎక్కువ గుర్తింపు ఉన్నా చాలా తక్కువ టైంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న హీరోగా…
పాత క్లాసిక్స్, బ్లాక్ బస్టర్ సినిమాలకున్న అతి పెద్ద సమస్య ఒరిజినల్ నెగటివ్స్ లభ్యత. ఈ కారణంగానే జగదేకవీరుడు అతిలోకసుందరి,…
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఇవాళ విడుదలయ్యింది. తెలుగులో ఒక రోజు పేరుతో డబ్బింగ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్…
ఈ రోజుల్లో పెద్ద, చిన్న అని తేడా లేకుండా ప్రతి సినిమాకూ రిలీజ్ డేట్ మారడం అన్నది మామూలైపోయింది. ఐతే…
ఆలు లేదు చూలు లేదు.. అనే సామెతను గుర్తుకు తెస్తోంది తెలుగు సోషల్ మీడియా గొడవలు చూస్తే. సినిమాలు, రాజకీయాల…
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాబజార్ కు పని చేసిన వ్యక్తి ఇప్పుడో సినిమాకు దర్శకత్వం వహించారంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు…