అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న థాంక్ యు రిలీజ్ డేట్ లాక్ అయినట్టుగా ఫిలిం నగర్ అప్డేట్. జూలై 7 విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు నిర్ణయం తీసుకున్నారట. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ ఎందుకో దీని తాలూకు సమాచారాన్ని ఇవ్వడంలో ఎస్విసి సంస్థ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఈలోగా హీరో నాగ చైతన్య దర్శకుడు విక్రమ్ కుమార్ లు తమ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దూత వెబ్ సిరీస్ ని చకచకా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇటీవలే అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చారు.
థాంక్ యుకి జూలై 7 అనుకూలమైన తేదీనే. ఇంకా రెండు నెలలు టైం ఉంది కాబట్టి ప్రమోషన్లు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మరుసటి రోజే నితిన్ మాచర్ల నియోజకవర్గం రాబోతోంది. 8న విడుదల చేయబోతున్నట్టు చాలా రోజుల క్రితమే అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు వందల కోట్ల భారీ ప్రాజెక్టులు కాదు కాబట్టి పోటీ పడటంలో రిస్క్ ఏమి లేదు కానీ సరిగ్గా దీనికి వారం ముందు జూలై 1న పక్కా కమర్షియల్, రంగ రంగ వైభవంగా, రాకెట్రీలు వచ్చేసి ఉంటాయి. సో కాంపిటీషన్ తక్కువేమి లేదు.
రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన థాంక్ యులో చాలా ఆకర్షణలున్నాయి. ఇందులో చైతు హార్డ్ కోర్ మహేష్ బాబు అభిమానిగా నటిస్తున్నాడు. దీనికోసమే ప్రత్యేకంగా ఒక్కడు పోకిరి కటవుట్లు వేసి షూటింగ్ చేశారు. ఉయ్యాలా జంపాల ఫేమ్ అవికా గోర్ మరో ముఖ్యమైన పాత్ర చేస్తోంది. తమన్ సంగీతం స్పెషల్ అట్రాక్షనని వేరే చెప్పనక్కర్లేదు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకులు పిసి శ్రీరామ్ కెమెరా బాధ్యతలు నిర్వహించారు. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా కంటెంట్ చాలా గట్టిగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఇంతకంటే ఫ్యాన్స్ కి ఏం కావాలి
This post was last modified on May 6, 2022 5:06 pm
సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…
గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై…
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల…