ఈ ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా అంటే.. ‘ఆర్ఆర్ఆర్’యే. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకులను పలకరించింది. ఆరంభంలో కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా సరే.. తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని సృష్టించిందీ రాజమౌళి సినిమా.
రిలీజై నెల రోజులు దాటినా ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ ఓ మోస్తరుగా కలెక్షన్లు రాబడుతూనే ఉంది. ఒక్క ‘కేజీఎఫ్-2’ మినహా ఆ చిత్రానికి గత ఐదు వారాల్లో పోటీ ఇచ్చిన సినిమానే లేదు. గత శని, ఆదివారాల్లో.. రంజాన్ రోజైన మంగళవారం ఈ చిత్రానికి అక్కడక్కడా ఫుల్స్ పడటం విశేషం.
కొన్ని సెంటర్లలో ఈ చిత్రం 50 రోజుల ప్రదర్శనను కూడా పూర్తి చేసుకోబోతోంది. ఆ వెంటనే డిజిటల్ రిలీజ్ వెళ్లబోతోంది ‘ఆర్ఆర్ఆర్’. విశ్వసనీయ సమాచారం ప్రకారం మే 20న ‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ ప్రిమియర్స్ ఉండబోతున్నాయి. ఇందుకు సన్నాహాలు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది.
థియేట్రికల్ రిలీజ్కు చాన్నాళ్ల ముందే, గత ఏడాదే ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ డీల్ పూర్తయింది. హిందీ వెర్షన్ హక్కులను నెట్ ఫ్లిక్స్కు, మిగతా అన్ని వెర్షన్ల రైట్స్ జీ5 సంస్థకు రాసిచ్చేశారు. దాదాపు రూ.350 కోట్ల మేర ఈ హక్కులు పలికాయి. రిలీజ్ తర్వాత 50 రోజులకు సినిమాను ఓటీటీల్లోకి తెచ్చేలా ఒప్పందం కుదిరింది.
ఈ సినిమాకున్న హైప్, బాక్సాఫీస్ దగ్గర సాధించిన భారీ విజయం దృష్ట్యా.. థియేట్రికల్ రిలీజ్ తరహాలోనే డిజిటల్ రిలీజ్ విషయంలోనూ హంగామాను చూడబోతున్నట్లే. రిపీట్ వాల్యూ ఉన్న సినిమా కావడంతో డిజిటల్ రిలీజ్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
టికెట్ల ధరలు ఎక్కువ ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్, రిపీటెడ్గా సినిమా చూసే ప్రేక్షకులు అనుకున్నంత స్థాయిలో సినిమా చూడలేదనే చెప్పాలి. ఆల్రెడీ చూసిన వాళ్లు కూడా మళ్లీ ఒకసారి సినిమాపై ఓ లుక్కేసే అవకాశం ఉండటంతో డిజిటల్లోనూ సినిమాకు మంచి హైప్ రావడం, వ్యూస్ పరంగా రికార్డులు సృష్టించడం గ్యారెంటీ.
This post was last modified on May 4, 2022 6:02 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…