ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లు దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాక ప్యాన్ ఇండియా పదానికి ప్రాధాన్యం మరింతగా పెరిగిపోయింది. బాహుబలితో ప్రభాస్ రాజమౌళిలు సృష్టించిన మార్కెట్ ని ఇప్పుడు మిగిలినవాళ్లు విస్తృతపరిచే పనిలో ఉన్నారు. అయితే ఈ కాన్సెప్ట్ ముప్పై ఏళ్ళ క్రితమే మన సౌత్ లో వచ్చిందని, అందులో మన టాలీవుడ్ హీరో నాగార్జున కూడా భాగమయ్యారని తెలిస్తే పాత సినిమాల మీద అవగాహన తక్కువగా ఉన్నవాళ్లకు ఖచ్చితంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ విశేషాలేంటో మీరే చూడండి.
1991లో శాండల్ వుడ్ స్టార్ రవిచంద్రన్ శాంతి క్రాంతి టైటిల్ తో ఒక భారీ సినిమా తీశారు. కన్నడలో తను హీరోగా, తెలుగులో నాగార్జున, తమిళం – హిందీలో రజనీకాంత్ లను కథానాయకులుగా తీసుకుని నాలుగు భాషల్లో వేర్వేరుగా ఏకకాలంలో షూటింగ్ చేశారు. అన్ని లాంగ్వేజెస్ లో జుహీ చావ్లానే హీరోయిన్. ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత వీరాస్వామి. అప్పటిదాకా ఆ కుటుంబం సంపాదించినదంతా ఈ సినిమాలోనే పెట్టారు. కోట్ల రూపాయలు మంచి నీళ్లలా ఖర్చయ్యాయి. ఒకదశలో డబ్బు కొరత ఏర్పడింది.
ఈలోగా సర్దుబాటు కోసం చినతంబీ(తెలుగు చంటి)రీమేక్ రామాచారి చేసుకుని సూపర్ హిట్ కొట్టారు. దానికి వచ్చిన సొమ్ములతో శాంతి క్రాంతి పూర్తయ్యింది. కెజిఎఫ్ 1లో మనకు రాఖీభాయ్ కథ చెప్పే అనంత్ నాగ్ ఇందులో మెయిన్ విలన్. హీరో పాత్ర పోలీస్ ఆఫీసర్. సంగీత దర్శకులు హంసలేఖ 10 పాటలు ఇచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ యాక్షన్ గ్రాండియర్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఒకవేళ హిట్ అయ్యుంటే చరిత్ర ఇంకోలా ఉండేది కానీ మొదటి ప్యాన్ ఇండియా మూవీ ఘనత మాత్రం రవిచంద్రన్ దే.
This post was last modified on May 4, 2022 3:56 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…