కరోనా మహమ్మారి ప్రభావం నుంచి బయటపడి ఇండియన్ బాక్సాఫీస్ బాగానే పుంజుకుంటోంది. ముఖ్యంగా సౌత్ సినిమాలు షేకాడించేస్తున్నాయి. గత డిసెంబరులో అఖండ, పుష్ప సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే. థర్డ్ వేవ్ చిన్న బ్రేక్ ఇచ్చాక.. మళ్లీ మన బాక్సాఫీస్ బాగానే ఊపందుకుంది. ముందుగా భీమ్లా నాయక్ జోష్ తీసుకొస్తే.. గత రెండు వారాలుగా ఆర్ఆర్ఆర్ ప్రభంజనం సాగిస్తోంది.
హిందీలో ఈ మధ్య కశ్మీర్ ఫైల్స్ సినిమా వసూళ్ల మోత మోగించింది. మిగతా భాషల్లోనూ కొన్ని సినిమాలు బాగా ఆడాయి. ఐతే వచ్చే వారం మొత్తంగా ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా థియేటర్లు కళకళలాడబోతున్నాయి. వసూళ్ల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బంపర్ క్రేజ్ మధ్య కేజీఎఫ్-2 రిలీజ్ కానుంది. ఆ సినిమాకు ఆ భాష, ఈ భాష.. ఆ ఏరియా, ఈ ఏరియా అని తేడా లేకుండా అంతటా క్రేజ్ ఉంది.
హిందీలో ఈ సినిమాకు ఆల్రెడీ ఒక రేంజిలో జరుగుతున్నాయి అడ్వాన్స్ బుకింగ్స్. దీంతో పాటుగా హిందీలో జెర్సీ లాంటి క్రేజీ మూవీ రాబోతోంది. ఈ సినిమా మీదా మంచి అంచనాలే ఉన్నాయి. నార్త్ ఇండియా అంతటా ఈ సినిమాలకు భారీ వసూళ్లు గ్యారెంటీ. ఇక కేజీఎఫ్-2 దక్షిణాదిన కూడా బాక్సాఫీస్లో ప్రభంజనం సృష్టించడం గ్యారెంటీ.
దీంతో పాటుగా విజయ్ సినిమా బీస్ట్ కూడా భారీ అంచనాల మధ్య రాబోతోంది. దానికీ సౌత్లో భారీ వసూళ్లుంటాయి. ఇక ఆర్ఆర్ఆర్ సైతం ఇప్పుడే రన్ ముగించేలా కనిపించడం లేదు. అది వచ్చే వారం కూడా మంచి వసూళ్లే రాబట్టే ఛాన్సుంది. మిగతా సినిమాల ఓవర్ ఫ్లోస్ దీనికి కలిసి రావచ్చు. మొత్తంగా వచ్చే వారం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ సునామీ చూడబోతున్నట్లే
This post was last modified on April 10, 2022 2:53 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
+ దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానిదే. + దేశ సరిహద్దుల నుంచి పెరుగుతున్న చొరబాట్లను…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…