గత కొన్నేళ్లలో భారతీయ చిత్రాల బడ్జెట్లు అమాంతం పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లే పారితోషకాలూ ఎక్కడికో వెళ్లిపోయాయి. ఐతే రెమ్యూనరేషన్ల సంగతి తీసుకుంటే ఎప్పుడూ హీరోలదే ఆధిపత్యం. ఇప్పుడు ఇండియాలో వంద కోట్ల పారితోషకం అందుకునే హీరోలు కూడా ఉన్నారు. మన ప్రభాస్ సైతం ఆ క్లబ్బులో ఉండటం విశేషం. ఐతే హీరోలతో పోలిస్తే హీరోయిన్ల పారితోషకాలు చాలా తక్కువనే చెప్పాలి.
పది కోట్లకు పైగా పారితోషకం అందుకునే హీరోయిన్లను వేళ్ల మీదే లెక్కబెట్టొచ్చు. ఈ జాబితాలో ఉన్నది బాలీవుడ్ హీరోయిన్లే. దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి కొందరు హీరోయిన్లు ఈ క్లబ్బులో ఉన్నారు. వీళ్లు పది కోట్ల క్లబ్బులో చేరినపుడే ఔరా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆలియా ఏకంగా 20 కోట్ల క్లబ్బులో చేరిన తొలి భారతీయ కథానాయిక రికార్డు సృష్టించడం విశేషం.
కొన్ని రోజులుగా భారతీయ సినీ పరిశ్రమలో ఆలియా పేరు మార్మోగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణంగా ‘గంగూబాయి కతియావాడీ’ సినిమాలో ఆమె ఇచ్చిన అదిరిపోయే పెర్ఫామెన్సే. ముందు ఈ పాత్రను ఆలియా ఏమాత్రం చేయగలదో అని సందేహించిన వాళ్లంతా కూడా సినిమా చూశాక ఆమె నటనకు ఫిదా అయిపోయారు. పెర్ఫామెన్స్ పరంగా ఆమె ఈ చిత్రాన్ని తన భుజాల మీద మోసిందనే చెప్పాలి.
అందుకే తన కష్టానికి తగ్గ పారితోషకమే ఇచ్చాడట దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ. ‘గంగూబాయి’ సినిమాకు గాను ఆలియా రికార్డు స్థాయిలో రూ.20 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇండియన్ సినిమాలో ఇంకే హీరోయిన్ ఇంత రెమ్యూనరేషన్ తీసుకోలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో క్యామియో తరహా పాత్ర చేసిన అజయ్ దేవగణ్ రూ.11 కోట్లు పుచ్చుకున్నాడట. మంచి టాక్, రివ్యూలు తెచ్చుకున్న ‘గంగూబాయి’.. చక్కటి వసూళ్లతో సాగిపోతోంది.
This post was last modified on March 2, 2022 9:29 am
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…