గత కొన్నేళ్లలో భారతీయ చిత్రాల బడ్జెట్లు అమాంతం పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లే పారితోషకాలూ ఎక్కడికో వెళ్లిపోయాయి. ఐతే రెమ్యూనరేషన్ల సంగతి తీసుకుంటే ఎప్పుడూ హీరోలదే ఆధిపత్యం. ఇప్పుడు ఇండియాలో వంద కోట్ల పారితోషకం అందుకునే హీరోలు కూడా ఉన్నారు. మన ప్రభాస్ సైతం ఆ క్లబ్బులో ఉండటం విశేషం. ఐతే హీరోలతో పోలిస్తే హీరోయిన్ల పారితోషకాలు చాలా తక్కువనే చెప్పాలి.
పది కోట్లకు పైగా పారితోషకం అందుకునే హీరోయిన్లను వేళ్ల మీదే లెక్కబెట్టొచ్చు. ఈ జాబితాలో ఉన్నది బాలీవుడ్ హీరోయిన్లే. దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి కొందరు హీరోయిన్లు ఈ క్లబ్బులో ఉన్నారు. వీళ్లు పది కోట్ల క్లబ్బులో చేరినపుడే ఔరా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆలియా ఏకంగా 20 కోట్ల క్లబ్బులో చేరిన తొలి భారతీయ కథానాయిక రికార్డు సృష్టించడం విశేషం.
కొన్ని రోజులుగా భారతీయ సినీ పరిశ్రమలో ఆలియా పేరు మార్మోగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణంగా ‘గంగూబాయి కతియావాడీ’ సినిమాలో ఆమె ఇచ్చిన అదిరిపోయే పెర్ఫామెన్సే. ముందు ఈ పాత్రను ఆలియా ఏమాత్రం చేయగలదో అని సందేహించిన వాళ్లంతా కూడా సినిమా చూశాక ఆమె నటనకు ఫిదా అయిపోయారు. పెర్ఫామెన్స్ పరంగా ఆమె ఈ చిత్రాన్ని తన భుజాల మీద మోసిందనే చెప్పాలి.
అందుకే తన కష్టానికి తగ్గ పారితోషకమే ఇచ్చాడట దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ. ‘గంగూబాయి’ సినిమాకు గాను ఆలియా రికార్డు స్థాయిలో రూ.20 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇండియన్ సినిమాలో ఇంకే హీరోయిన్ ఇంత రెమ్యూనరేషన్ తీసుకోలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో క్యామియో తరహా పాత్ర చేసిన అజయ్ దేవగణ్ రూ.11 కోట్లు పుచ్చుకున్నాడట. మంచి టాక్, రివ్యూలు తెచ్చుకున్న ‘గంగూబాయి’.. చక్కటి వసూళ్లతో సాగిపోతోంది.
This post was last modified on March 2, 2022 9:29 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…