కింగ్ నాగార్జున తనయుడు, టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య ఇటీవల భార్య సమంతకు విడాకులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే వీరిద్దరూ అనూహ్యంగా తాము విడిపోబోతున్నామని ప్రకటించి అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు. ఇక సామ్కి దూరమయ్యాక ఒంటరిగానే ఉంటున్న చైతు.. ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్కు కూడా సైన్ చేశాడు.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కోసం ఈ సిరీస్ తెరకెక్కబోతోంది. ఈ హర్రర్ కామెడీ థ్రిల్లర్ సిరీస్కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తనయుడు చైతు బాటలోనే నాగార్జున కూడా వెళ్లబోతున్నారట. ఈ మధ్యే `బంగార్రాజు`తో ప్రేక్షకులను పలకరించి సూపర్ హిట్ను ఖాతాలో వేసుకున్న నాగ్.. తాజాగా ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఓకే చెప్పారట.
కరోనా వైరస్ దెబ్బకు ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. దీంతో థియేటర్లకు గట్టి పోటీ ఇస్తున్న ఓటీటీలు.. ఎప్పటికప్పుడు స్పెషల్ కంటెంట్తో వస్తూ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. స్టార్ హీరో, హీరోయిన్లు సైతం ఓటీటీల కోసం వెబ్ సిరీస్లు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున సైతం ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు.
ఇందులో భాగంగా డిస్నీ ప్లస్ హాట్స్టార్ కోసం తెరకెక్కబోయే ఓ వెబ్ సిరీస్లో హీరోగా నటించేందుకు నాగ్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారట. ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే త్వరలోనే ఆ వెబ్ సిరీస్కు సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుంది.
This post was last modified on February 9, 2022 10:23 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…