కింగ్ నాగార్జున తనయుడు, టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య ఇటీవల భార్య సమంతకు విడాకులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే వీరిద్దరూ అనూహ్యంగా తాము విడిపోబోతున్నామని ప్రకటించి అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు. ఇక సామ్కి దూరమయ్యాక ఒంటరిగానే ఉంటున్న చైతు.. ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్కు కూడా సైన్ చేశాడు.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కోసం ఈ సిరీస్ తెరకెక్కబోతోంది. ఈ హర్రర్ కామెడీ థ్రిల్లర్ సిరీస్కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తనయుడు చైతు బాటలోనే నాగార్జున కూడా వెళ్లబోతున్నారట. ఈ మధ్యే `బంగార్రాజు`తో ప్రేక్షకులను పలకరించి సూపర్ హిట్ను ఖాతాలో వేసుకున్న నాగ్.. తాజాగా ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఓకే చెప్పారట.
కరోనా వైరస్ దెబ్బకు ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. దీంతో థియేటర్లకు గట్టి పోటీ ఇస్తున్న ఓటీటీలు.. ఎప్పటికప్పుడు స్పెషల్ కంటెంట్తో వస్తూ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. స్టార్ హీరో, హీరోయిన్లు సైతం ఓటీటీల కోసం వెబ్ సిరీస్లు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున సైతం ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు.
ఇందులో భాగంగా డిస్నీ ప్లస్ హాట్స్టార్ కోసం తెరకెక్కబోయే ఓ వెబ్ సిరీస్లో హీరోగా నటించేందుకు నాగ్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారట. ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే త్వరలోనే ఆ వెబ్ సిరీస్కు సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుంది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…