ఈ ఏడాది వేసవిలో ఇండియన్ బాక్సాఫీస్లో ఎన్నడూ చూడనంత సందడి చూడబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ సమ్మర్కి భారీ చిత్రాలు షెడ్యూల్ అయ్యాయి. అందులో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, కేజీఎఫ్-2 లాంటి పాన్ ఇండియా సినిమాలకు తోడు.. వివిధ భాషలకు సంబంధించి పెద్ద సినిమాలున్నాయి. ఐతే పై మూడు చిత్రాలపై ఉన్న అంచనాల దృష్ట్యా వీటికి పోటీగా ఏ భాషలోనూ వేరే సినిమాలు రిలీజయ్యే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు.
అందులోనూ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2లతో అయితే ఏ సినిమా అయినా పోటీకి సాహసిస్తుందా అన్నది అనుమానంగానే కనిపించింది. కానీ ‘కేజీఎఫ్-2’కు పోటీగా ఓ తమిళ భారీ చిత్రాన్ని థియేటర్లలో దించడానికి రంగం సిద్ధమవుతోంది. దీంతో సమ్మర్లో ఒక మెగా క్లాష్ చూడబోతున్నట్లే కనిపిస్తోంది. ‘కేజీఎఫ్-2’కు పోటీగా రానున్న ఆ చిత్రమే.. బీస్ట్.‘కేజీఎఫ్-2’ను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలన్నది ఇప్పటి నిర్ణయం కాదు.
చాన్నాళ్ల ముందే ఈ డేట్ ప్రకటించారు. ఐతే ఏప్రిల్ 14న తమిళులకు చాలా స్పెషల్ డేట్. అది తమిళులకు నూతన సంవత్సరాది. ప్రతి సంవత్సరం ఆ తేదీకి భారీ చిత్రాలు రిలీజవతుంటాయి. ఈసారికి విజయ్ ఈ డేట్ను కైవసం చేసుకున్నాడు. ‘డాక్టర్’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన నెల్సన్ దిలీప్కుమార్తో విజయ్ లాంటి టాప్ హీరో సినిమా చేయడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు.
ఇందులో పూజా హెగ్డే కథానాయిక కావడం కూడా ప్రత్యేక ఆకర్షణ. తమిళంతో పాటు వేరే భాషల్లోనూ దీనికి క్రేజ్ ఉంది. ఇక ‘కేజీఎఫ్-2’ మీద ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతి టైంలో ఓకే కానీ.. ఇలా రెండు భారీ చిత్రాలు వేసవిలో ఒకే తేదీకి రిలీజవడం అరుదు. ఐతే ఈ డేట్ను రెండు చిత్రాలూ వదులుకోవడానికి సిద్ధంగా లేవు. కాబట్టి సమ్మర్లో మెగా క్లాష్ చూడబోతున్నట్లే.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…