ఈ ఏడాది వేసవిలో ఇండియన్ బాక్సాఫీస్లో ఎన్నడూ చూడనంత సందడి చూడబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ సమ్మర్కి భారీ చిత్రాలు షెడ్యూల్ అయ్యాయి. అందులో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, కేజీఎఫ్-2 లాంటి పాన్ ఇండియా సినిమాలకు తోడు.. వివిధ భాషలకు సంబంధించి పెద్ద సినిమాలున్నాయి. ఐతే పై మూడు చిత్రాలపై ఉన్న అంచనాల దృష్ట్యా వీటికి పోటీగా ఏ భాషలోనూ వేరే సినిమాలు రిలీజయ్యే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు.
అందులోనూ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2లతో అయితే ఏ సినిమా అయినా పోటీకి సాహసిస్తుందా అన్నది అనుమానంగానే కనిపించింది. కానీ ‘కేజీఎఫ్-2’కు పోటీగా ఓ తమిళ భారీ చిత్రాన్ని థియేటర్లలో దించడానికి రంగం సిద్ధమవుతోంది. దీంతో సమ్మర్లో ఒక మెగా క్లాష్ చూడబోతున్నట్లే కనిపిస్తోంది. ‘కేజీఎఫ్-2’కు పోటీగా రానున్న ఆ చిత్రమే.. బీస్ట్.‘కేజీఎఫ్-2’ను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలన్నది ఇప్పటి నిర్ణయం కాదు.
చాన్నాళ్ల ముందే ఈ డేట్ ప్రకటించారు. ఐతే ఏప్రిల్ 14న తమిళులకు చాలా స్పెషల్ డేట్. అది తమిళులకు నూతన సంవత్సరాది. ప్రతి సంవత్సరం ఆ తేదీకి భారీ చిత్రాలు రిలీజవతుంటాయి. ఈసారికి విజయ్ ఈ డేట్ను కైవసం చేసుకున్నాడు. ‘డాక్టర్’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన నెల్సన్ దిలీప్కుమార్తో విజయ్ లాంటి టాప్ హీరో సినిమా చేయడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు.
ఇందులో పూజా హెగ్డే కథానాయిక కావడం కూడా ప్రత్యేక ఆకర్షణ. తమిళంతో పాటు వేరే భాషల్లోనూ దీనికి క్రేజ్ ఉంది. ఇక ‘కేజీఎఫ్-2’ మీద ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతి టైంలో ఓకే కానీ.. ఇలా రెండు భారీ చిత్రాలు వేసవిలో ఒకే తేదీకి రిలీజవడం అరుదు. ఐతే ఈ డేట్ను రెండు చిత్రాలూ వదులుకోవడానికి సిద్ధంగా లేవు. కాబట్టి సమ్మర్లో మెగా క్లాష్ చూడబోతున్నట్లే.
This post was last modified on February 7, 2022 8:12 pm
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…