టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ అందరూ కూడా పాన్ ఇండియా దర్శకులుగా మారిపోతున్నారు. రాజమౌళి, సుకుమార్, పూరి జగన్నాధ్, సుజీత్, రాధాకృష్ణ ఇలా చాలా మంది తెలుగు దర్శకులు పాన్ ఇండియా దర్శకులుగా మారిపోతున్నారు. త్వరలోనే కొరటాల శివ కూడా ఈ లిస్ట్ లో చేరతారని సమాచారం.
యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కూడా తన ‘శ్యామ్ సింగారాయ్’ సినిమా ఇతర భాషల్లో విడుదల చేసి పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేశారు. కానీ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మాత్రం ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేకపోయారు. సౌత్ కి పరిమితమయ్యే కథలను మాత్రమే ఎన్నుకుంటున్నారాయన.
అతడి లాస్ట్ సినిమా ‘అల వైకుంఠపురములో’ కూడా పెద్ద హిట్ అయింది కానీ ఈ సినిమాను తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. ఇందులో పాటలు మాత్రం నేషనల్ లెవెల్ లో పాపులర్ అయ్యాయి. ‘పుష్ప’ సినిమా తరువాత అల్లు అర్జున్ పాత సినిమాలన్నీ హిందీలో డబ్ అవుతున్నాయి.
‘అల.. వైకుంఠపురములో’ సినిమాను కూడా హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తుండడంతో డబ్బింగ్ ప్లాన్స్ ఆగిపోయాయి.
ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు త్రివిక్రమ్. అది కూడా పాన్ ఇండియా సినిమా కాదు. ఇంకెప్పుడు ఆయన పాన్ ఇండియా సినిమాలు తీస్తారనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి.
కానీ త్రివిక్రమ్ తీరు చూస్తుంటే మాత్రం ఆయన తెలుగు సినిమాలకే పరిమితమయ్యేలా కనిపిస్తున్నారు. పైగా ఇప్పుడు నిర్మాతగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పట్లో పాన్ ఇండియా ఆలోచన చేసే అవకాశం లేదంటున్నారు.
This post was last modified on January 26, 2022 8:14 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…