టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ అందరూ కూడా పాన్ ఇండియా దర్శకులుగా మారిపోతున్నారు. రాజమౌళి, సుకుమార్, పూరి జగన్నాధ్, సుజీత్, రాధాకృష్ణ ఇలా చాలా మంది తెలుగు దర్శకులు పాన్ ఇండియా దర్శకులుగా మారిపోతున్నారు. త్వరలోనే కొరటాల శివ కూడా ఈ లిస్ట్ లో చేరతారని సమాచారం.
యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కూడా తన ‘శ్యామ్ సింగారాయ్’ సినిమా ఇతర భాషల్లో విడుదల చేసి పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేశారు. కానీ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మాత్రం ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేకపోయారు. సౌత్ కి పరిమితమయ్యే కథలను మాత్రమే ఎన్నుకుంటున్నారాయన.
అతడి లాస్ట్ సినిమా ‘అల వైకుంఠపురములో’ కూడా పెద్ద హిట్ అయింది కానీ ఈ సినిమాను తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. ఇందులో పాటలు మాత్రం నేషనల్ లెవెల్ లో పాపులర్ అయ్యాయి. ‘పుష్ప’ సినిమా తరువాత అల్లు అర్జున్ పాత సినిమాలన్నీ హిందీలో డబ్ అవుతున్నాయి.
‘అల.. వైకుంఠపురములో’ సినిమాను కూడా హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తుండడంతో డబ్బింగ్ ప్లాన్స్ ఆగిపోయాయి.
ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు త్రివిక్రమ్. అది కూడా పాన్ ఇండియా సినిమా కాదు. ఇంకెప్పుడు ఆయన పాన్ ఇండియా సినిమాలు తీస్తారనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి.
కానీ త్రివిక్రమ్ తీరు చూస్తుంటే మాత్రం ఆయన తెలుగు సినిమాలకే పరిమితమయ్యేలా కనిపిస్తున్నారు. పైగా ఇప్పుడు నిర్మాతగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పట్లో పాన్ ఇండియా ఆలోచన చేసే అవకాశం లేదంటున్నారు.
This post was last modified on January 26, 2022 8:14 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…