కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమాకి సంబంధించిన ఏదొక వార్త వినిపిస్తూనే ఉంది. రీసెంట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే సినిమా మొదలుపెట్టారు ధనుష్. షూటింగ్ మొదలైన రెండో రోజే హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని చిత్రవర్గాలు చెప్పాయి. ఇప్పుడు సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నట్లుగా సమాచారం.
ముందుగా ఈ సినిమాకి దినేష్ కృష్ణన్ అనే తమిళ సినిమాటోగ్రాఫర్ ను తీసుకున్నారు. ఆయన కొన్ని రోజులు షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ.. ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తు నేను ఈ సినిమాలో భాగం కాలేకపోతున్నాను.. త్వరలోనే ఈ టీమ్ తో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
అయితే హ్యాష్ ట్యాగ్ కోవిడ్ అని ఇవ్వడంతో.. కరోనా వచ్చి ఆయన ఈ సినిమా నుంచి తప్పుకొని ఉంటారనే సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా.. సినిమా మొదలైన కొన్నిరోజులకే కెమెరామెన్ తప్పుకోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సందేశాత్మక చిత్రంగా రూపొందింస్తున్నారు. ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుందట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి దానికి పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో చూడాలి!
This post was last modified on January 26, 2022 8:11 am
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…