కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమాకి సంబంధించిన ఏదొక వార్త వినిపిస్తూనే ఉంది. రీసెంట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే సినిమా మొదలుపెట్టారు ధనుష్. షూటింగ్ మొదలైన రెండో రోజే హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని చిత్రవర్గాలు చెప్పాయి. ఇప్పుడు సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నట్లుగా సమాచారం.
ముందుగా ఈ సినిమాకి దినేష్ కృష్ణన్ అనే తమిళ సినిమాటోగ్రాఫర్ ను తీసుకున్నారు. ఆయన కొన్ని రోజులు షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ.. ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తు నేను ఈ సినిమాలో భాగం కాలేకపోతున్నాను.. త్వరలోనే ఈ టీమ్ తో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
అయితే హ్యాష్ ట్యాగ్ కోవిడ్ అని ఇవ్వడంతో.. కరోనా వచ్చి ఆయన ఈ సినిమా నుంచి తప్పుకొని ఉంటారనే సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా.. సినిమా మొదలైన కొన్నిరోజులకే కెమెరామెన్ తప్పుకోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సందేశాత్మక చిత్రంగా రూపొందింస్తున్నారు. ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుందట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి దానికి పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో చూడాలి!
This post was last modified on January 26, 2022 8:11 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…