కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమాకి సంబంధించిన ఏదొక వార్త వినిపిస్తూనే ఉంది. రీసెంట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే సినిమా మొదలుపెట్టారు ధనుష్. షూటింగ్ మొదలైన రెండో రోజే హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని చిత్రవర్గాలు చెప్పాయి. ఇప్పుడు సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నట్లుగా సమాచారం.
ముందుగా ఈ సినిమాకి దినేష్ కృష్ణన్ అనే తమిళ సినిమాటోగ్రాఫర్ ను తీసుకున్నారు. ఆయన కొన్ని రోజులు షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ.. ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తు నేను ఈ సినిమాలో భాగం కాలేకపోతున్నాను.. త్వరలోనే ఈ టీమ్ తో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
అయితే హ్యాష్ ట్యాగ్ కోవిడ్ అని ఇవ్వడంతో.. కరోనా వచ్చి ఆయన ఈ సినిమా నుంచి తప్పుకొని ఉంటారనే సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా.. సినిమా మొదలైన కొన్నిరోజులకే కెమెరామెన్ తప్పుకోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సందేశాత్మక చిత్రంగా రూపొందింస్తున్నారు. ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుందట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి దానికి పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో చూడాలి!
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…
72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు అవార్డు పుష్ప 2కి గాను అల్లు అర్జున్ కి మరోసారి రావొచ్చేమో అని…
క, కె ర్యాంప్ ఊపులో ఉన్న కిరణ్ అబ్బవరంకు మధ్యలో దిల్ రుబా ఒకటే షాక్ ఇచ్చింది కానీ దాని…
తెలుగు సినిమాలో స్క్రీన్ ప్లే అనగానే గుర్తుకొచ్చే పేరు.. సుకుమార్. ఈ లెక్కల మాస్టారి కథన నైపుణ్యం గురించి ఎంత…
72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న…
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…