కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమాకి సంబంధించిన ఏదొక వార్త వినిపిస్తూనే ఉంది. రీసెంట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే సినిమా మొదలుపెట్టారు ధనుష్. షూటింగ్ మొదలైన రెండో రోజే హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని చిత్రవర్గాలు చెప్పాయి. ఇప్పుడు సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నట్లుగా సమాచారం.
ముందుగా ఈ సినిమాకి దినేష్ కృష్ణన్ అనే తమిళ సినిమాటోగ్రాఫర్ ను తీసుకున్నారు. ఆయన కొన్ని రోజులు షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ.. ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తు నేను ఈ సినిమాలో భాగం కాలేకపోతున్నాను.. త్వరలోనే ఈ టీమ్ తో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
అయితే హ్యాష్ ట్యాగ్ కోవిడ్ అని ఇవ్వడంతో.. కరోనా వచ్చి ఆయన ఈ సినిమా నుంచి తప్పుకొని ఉంటారనే సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా.. సినిమా మొదలైన కొన్నిరోజులకే కెమెరామెన్ తప్పుకోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సందేశాత్మక చిత్రంగా రూపొందింస్తున్నారు. ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుందట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి దానికి పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో చూడాలి!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…