ఒకప్పుడు ఎన్నో హిట్టు సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు కృష్ణవంశీ.. ఇప్పుడు ఒక హిట్ కోసం పరితపిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన తీసిన సినిమా ఏదీ కూడా వర్కవుట్ అవ్వలేదు. దీంతో హీరోలు అతడితో కలిసి పని చేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. అలాంటి సమయంలో మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నట సామ్రాట్’ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు కృష్ణవంశీ. ఆల్రెడీ హిట్ కథ కావడంతో తెలుగులో కూడా సినిమాకి మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నారు.
అయితే ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కృష్ణవంశీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్ర కోసం ఇక్కడ ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. అలానే నానా పటేకర్ స్నేహితుడి పాత్ర కథకు చాలా కీలకం. మరాఠీలో ఆ పాత్రను విక్రమ్ గోఖలే పోషించారు. ఆయన పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో అయితే నానా పటేకర్ ను డామినేట్ చేశారనే చెప్పాలి.
అలాంటి పాత్ర కోసం తెలుగులో బ్రహ్మానందాన్ని తీసుకొని షాకిచ్చారు కృష్ణవంశీ. నిజానికి అది చాలా సీరియస్ గా ఎమోషనల్ గా సాగే పాత్ర. కొంచెం కూడా కామెడీ ఉండదు. పైగా ఆ పాత్రకు యాంటీ క్లైమాక్స్ ఇచ్చారు దర్శకుడు. అలాంటి పాత్రలో బ్రహ్మీను తీసుకోవడం సాహసమనే చెప్పాలి. పైగా ఈ సినిమాలో తొలిసారి గడ్డంతో కనిపించబోతున్నారు బ్రహ్మానందం.
నిజానికి ఈ పాత్రలో నటించడానికి ఓ సీనియర్ నటుడు ఆసక్తి చూపించారట. కృష్ణవంశీకి ఫోన్ చేసి మరీ అడిగారట. రెమ్యునరేషన్ కూడా వద్దని చెప్పారట. అయినప్పటికీ కృష్ణవంశీ మాత్రం బ్రహ్మానందాన్ని తప్ప ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేనని చెప్పేశారట. ఇక రీసెంట్ గా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంలపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక సీన్ లో బ్రహ్మానందం నటన చూసి కృష్ణవంశీ ఎమోషనల్ అయ్యారట. ఆ సీన్ పూర్తయిన వెంటనే బ్రహ్మానందాన్ని కౌగిలించుకొని తన ప్రేమను కురిపించారట.
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…