బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. ఇప్పటివరకు తెలుగులో మొత్తం ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది ఈ షో. రీసెంట్ గా హిందీలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ను మొదలుపెట్టారు. అక్కడ ఈ షో ఆశించిన స్థాయిలో క్లిక్ అవ్వలేదు. కానీ తెలుగులో కూడా ఓటీటీ వెర్షన్ ను మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ ఓటీటీ బిగ్ బాస్ షో మొదలవుతుంది. అక్కినేని నాగార్జున దీన్ని హోస్ట్ చేయబోతున్నారు. సాధారణంగా బిగ్ బాస్ షోలో ఒక సింగర్, ఒక డాన్స్ మాస్టర్, ఒక కమెడియన్ ఇలా అన్ని కేటగిరీలకు చెందిన ఒక్కో కంటెస్టెంట్ ఉండేలా చూసుకుంటారు. ఇప్పటివరకు కల్పన, గీతామాధురి, రాహుల్ సిప్లిగంజ్, శ్రీరామచంద్ర ఇలా చాలా మంది సింగర్స్ ఈ షోలో కనిపించారు.
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో కూడా ఓ సింగర్ కనిపించబోతున్నాడని సమాచారం. అతడు మరెవరో కాదు.. హేమచంద్ర. ఇప్పటికే అతడి రెండు, మూడు సార్లు బిగ్ బాస్ షోకి వెళ్లే అవకాశం వచ్చినా.. వదులుకున్నారట. కానీ ఈసారి మాత్రం హేమచంద్ర బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయని సమాచారం.
హేమచంద్రకు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ఎన్నో హిట్ సాంగ్స్ పాడి తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అలానే కొన్ని సినిమాల్లో విలన్ రోల్స్ కి డబ్బింగ్ చెప్పి మెప్పించారు హేమచంద్ర. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో దోస్తీ సాంగ్ పాడి తన రేంజ్ మరింత పెంచుకున్నారు. మరి బిగ్ బాస్ షో అతడికి ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుందో చూడాలి!
This post was last modified on January 12, 2022 7:44 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…