బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. ఇప్పటివరకు తెలుగులో మొత్తం ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది ఈ షో. రీసెంట్ గా హిందీలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ను మొదలుపెట్టారు. అక్కడ ఈ షో ఆశించిన స్థాయిలో క్లిక్ అవ్వలేదు. కానీ తెలుగులో కూడా ఓటీటీ వెర్షన్ ను మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ ఓటీటీ బిగ్ బాస్ షో మొదలవుతుంది. అక్కినేని నాగార్జున దీన్ని హోస్ట్ చేయబోతున్నారు. సాధారణంగా బిగ్ బాస్ షోలో ఒక సింగర్, ఒక డాన్స్ మాస్టర్, ఒక కమెడియన్ ఇలా అన్ని కేటగిరీలకు చెందిన ఒక్కో కంటెస్టెంట్ ఉండేలా చూసుకుంటారు. ఇప్పటివరకు కల్పన, గీతామాధురి, రాహుల్ సిప్లిగంజ్, శ్రీరామచంద్ర ఇలా చాలా మంది సింగర్స్ ఈ షోలో కనిపించారు.
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో కూడా ఓ సింగర్ కనిపించబోతున్నాడని సమాచారం. అతడు మరెవరో కాదు.. హేమచంద్ర. ఇప్పటికే అతడి రెండు, మూడు సార్లు బిగ్ బాస్ షోకి వెళ్లే అవకాశం వచ్చినా.. వదులుకున్నారట. కానీ ఈసారి మాత్రం హేమచంద్ర బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయని సమాచారం.
హేమచంద్రకు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ఎన్నో హిట్ సాంగ్స్ పాడి తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అలానే కొన్ని సినిమాల్లో విలన్ రోల్స్ కి డబ్బింగ్ చెప్పి మెప్పించారు హేమచంద్ర. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో దోస్తీ సాంగ్ పాడి తన రేంజ్ మరింత పెంచుకున్నారు. మరి బిగ్ బాస్ షో అతడికి ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుందో చూడాలి!
This post was last modified on January 12, 2022 7:44 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…