Movie News

ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ చాలెంజ్ విసిరిన తమ్మారెడ్డి

ఎవరేం అన్నా సరే.. ఎంత మాట అన్నా సరే.. పడదాం. బయటకు వచ్చి మాట్లాడి పలుచన కావటం ఎందుకు? ఎవరినో ఎవరో అన్నారు.. మనల్ని కాదు కదా? అన్నట్లుగా వ్యవహరించే వారందరి బూజు వదిలేలా.. అప్పటివరకు పట్టిన భయం మత్తు వీడిపోయేలా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన ‘సినిమా వాళ్లకు బలిసింది’ మాటలకు టాలీవుడ్ ప్రముఖులు నోరు విప్పుతున్నారు. తాజాగా సీనియర్ నిర్మాత కమ్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ఘాటుగా రియాక్టు అయ్యారు. సినిమా వాళ్లను అంత మాట అనేస్తారా? అని ప్రశ్నించటమే కాదు.. దమ్ముంటే.. ఎవరికి బలిసిందో తెలియాలంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఓపెన్ డిబేట్ కు రావాలంటూ సవాలు విసిరారు.

తాజాగా ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. “సినిమా వాళ్లంటే చీప్ గా దొరికారని బలిశారు అని మాట్లాడుతున్నారు. ఎవరు బలిశారు సర్? మీ ఎమ్మెల్యేలు ఎంతెంత తింటున్నారు? మీ చరిత్రలేంటి? వాటి గురించి మాట్లాడదామా? ఓపెన్ డిబేట్ కు వస్తారా ఎవరైనా? అని సూటిగా ప్రశ్నించారు. అక్కడితో ఆగని ఆయన.. ఎవరిని మెప్పించటానికి మీరు బలుపులు.. కులాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

“మీరంతా రాజకీయాల్లోకి రాక ముందు మీ ఆస్తులు ఎంత? వచ్చాక ఎంత? మీ పార్టీలోని చోటామోటా నాయకుల ఆస్తులు తీయండి. మా సినిమా వాళ్ల ఆస్తులు తీద్దాం రండి. ఎవరి ఆస్తి ఎంతుందో లెక్క తీద్దామా? దమ్ముంటే రండి. ఓపెన్ ఛాలెంజ్” అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే చేసిన ‘సినిమా వాళ్లకు బలిసింది’ అన్న మాటకు రెండు రోజులు ఆలస్యంగా స్పందించిన తమ్మారెడ్డి.. అందుకు తగ్గట్లే రియాక్టు అయ్యారని చెప్పాలి.

తాము కష్టపడి సంపాదిస్తున్నామని.. సినిమాను తయారు చేస్తున్నామని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. తమ కళలను అమ్ముకుంటున్నామని.. ఒక సినిమాకు 200 మందికి పైనే కష్టపడతారన్నారు. తాము కోట్లకు కోట్లు పెట్టి పైసా పైసా ఏరుకుంటున్నామన్నారు. “అంతేకానీ మీలా ఒక రూపాయి పెట్టి మొత్తం అంతా దోచుకుతినట్లేదు. మమ్మల్ని బలుపు అనడానికి అసలు మీరెవరు? మీ బలుపు సంగతి మీరు చూసుకోండి. పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని సవినయంగా మనవి చేస్తున్నా” అంటూ తన లోపలి ఫైర్ ను తమ్మారెడ్డి తొలిసారి బయటపెట్టారు.

This post was last modified on January 12, 2022 5:49 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

3 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

3 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

4 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

5 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

5 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

11 hours ago