టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు నుంచి రాబోతున్న కొత్త చిత్రం.. రౌడీ బాయ్స్. ఆయన సోదరుడు శిరీష్ కొడుకైన అశిష్ రెడ్డి ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సెన్సార్ చేయించినపుడు సెన్సార్ బోర్డు సభ్యులు ఆశ్చర్యపోయారట.
ఇది నిజంగా మీ సినిమానేనా అని దిల్ రాజును అడిగారట. అందుక్కారణం.. ఇందులో కొంచెం బోల్డ్, రొమాంటిక్ కంటెంట్ ఎక్కువగా ఉండటమే. మామూలుగా తమ సంస్థ నుంచి వచ్చే సినిమాలు చాలా పద్ధతిగా, ఫ్యామిలీస్ అంతా ఎంజాయ్ చేసేలా ఉంటాయని.. కానీ రౌడీ బాయ్స్ విషయంలో తాము కొంచెం హద్దులు దాటామని నవ్వుతూ చెప్పారు దిల్ రాజు.
తన సోదరుడి కొడుకు హీరోగా లాంచ్ అవుతున్నపుడు సినిమా యూత్ ఫుల్గా ఉండాలని అనుకున్నామని.. అందుకే హుషారు దర్శకుడు హర్షకు చెప్పి మంచి యూత్ ఫుల్ స్టోరీ రెడీ చేయించామని.. ప్రేమ దేశం, తొలి ప్రేమ, హ్యాపీ డేస్, అలాగే తమ సంస్థ నుంచి వచ్చిన ఆర్య సినిమాల తరహాలో రౌడీ బాయ్స్ చాలా యూత్ ఫుల్గా ఉంటుందని.. 15-25 వయసులో ఉన్న యువత అందరూ ఫుల్గా ఎంజాయ్ చేసేలా సినిమా తీశామని చెప్పాడు దిల్ రాజు.
తమ సంస్థలో ఆర్య సినిమా తెరకెక్కుతున్న సమయానికి అశిష్ వయసు ఏడేళ్లని.. అందులో తకథిమితోం పాట చిత్రీకరిస్తున్నపుడు సెట్లోకి వచ్చి తన పాటికి తాను సంగీతానికి అనుగుణంగా స్టెప్స్ వేస్తుండేవాడని.. అప్పుడు అల్లు అర్జున్ కూడా అతణ్ని చూస్తూ ఉండిపోయాడని దిల్ రాజు గుర్తు చేసుకున్నాడు. సంక్రాంతికి తమ బేనర్ నుంచి ఐదు సినిమాలు రిలీజైతే.. ఆ ఐదూ సూపర్ హిట్లే అని.. ఈ ఒరవడిని కొనసాగిస్తూ రౌడీ బాయ్స్ డబుల్ హ్యాట్రిక్ అవుతుందని రాజు ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on January 11, 2022 10:06 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…