టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు నుంచి రాబోతున్న కొత్త చిత్రం.. రౌడీ బాయ్స్. ఆయన సోదరుడు శిరీష్ కొడుకైన అశిష్ రెడ్డి ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సెన్సార్ చేయించినపుడు సెన్సార్ బోర్డు సభ్యులు ఆశ్చర్యపోయారట.
ఇది నిజంగా మీ సినిమానేనా అని దిల్ రాజును అడిగారట. అందుక్కారణం.. ఇందులో కొంచెం బోల్డ్, రొమాంటిక్ కంటెంట్ ఎక్కువగా ఉండటమే. మామూలుగా తమ సంస్థ నుంచి వచ్చే సినిమాలు చాలా పద్ధతిగా, ఫ్యామిలీస్ అంతా ఎంజాయ్ చేసేలా ఉంటాయని.. కానీ రౌడీ బాయ్స్ విషయంలో తాము కొంచెం హద్దులు దాటామని నవ్వుతూ చెప్పారు దిల్ రాజు.
తన సోదరుడి కొడుకు హీరోగా లాంచ్ అవుతున్నపుడు సినిమా యూత్ ఫుల్గా ఉండాలని అనుకున్నామని.. అందుకే హుషారు దర్శకుడు హర్షకు చెప్పి మంచి యూత్ ఫుల్ స్టోరీ రెడీ చేయించామని.. ప్రేమ దేశం, తొలి ప్రేమ, హ్యాపీ డేస్, అలాగే తమ సంస్థ నుంచి వచ్చిన ఆర్య సినిమాల తరహాలో రౌడీ బాయ్స్ చాలా యూత్ ఫుల్గా ఉంటుందని.. 15-25 వయసులో ఉన్న యువత అందరూ ఫుల్గా ఎంజాయ్ చేసేలా సినిమా తీశామని చెప్పాడు దిల్ రాజు.
తమ సంస్థలో ఆర్య సినిమా తెరకెక్కుతున్న సమయానికి అశిష్ వయసు ఏడేళ్లని.. అందులో తకథిమితోం పాట చిత్రీకరిస్తున్నపుడు సెట్లోకి వచ్చి తన పాటికి తాను సంగీతానికి అనుగుణంగా స్టెప్స్ వేస్తుండేవాడని.. అప్పుడు అల్లు అర్జున్ కూడా అతణ్ని చూస్తూ ఉండిపోయాడని దిల్ రాజు గుర్తు చేసుకున్నాడు. సంక్రాంతికి తమ బేనర్ నుంచి ఐదు సినిమాలు రిలీజైతే.. ఆ ఐదూ సూపర్ హిట్లే అని.. ఈ ఒరవడిని కొనసాగిస్తూ రౌడీ బాయ్స్ డబుల్ హ్యాట్రిక్ అవుతుందని రాజు ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on January 11, 2022 10:06 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…