చిరంజీవి సినిమా అంటేనే ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది ఆయనతో కలిసి బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడంటే ఎలా ఉంటుంది! ‘గాడ్ఫాదర్’లో చిరుకి చెల్లెలిగా నయనతార నటిస్తోందనే వార్త ఎంత కిక్ ఇచ్చిందో.. అంతకు నాలుగైదు రెట్లు జోష్నిచ్చింది ఈ వార్త. ఈ ఇద్దరినీ కలిసి వెండితెర మీద చూసేందుకు ఎదురు చూడటం అప్పుడే మొదలుపెట్టేశారు మెగా ఫ్యాన్స్.
ఈ చిత్రానికి మాతృక అయిన మలయాళీ సూపర్ హిట్ ‘లూసిఫర్’లో హీరోకి ఓ నమ్మకమైన అనుచరుడు ఉంటాడు. హీరోకి ఏ కష్టం వచ్చినా క్షణాల్లో వచ్చి వాలిపోతాడు. తన ప్రాణాలను అడ్డేసి మరీ హీరోని సమస్యల నుంచి గట్టెక్కిస్తుంటాడు. అందులో ఆ క్యారెక్టర్ని పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించాడు. తెలుగులో సల్లూ భాయ్ చేస్తున్నాడు.
త్వరలో సల్మాన్ షూట్లో కూడా జాయినవబోతున్నాడట. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ని హైదరాబాద్లోనే ప్లాన్ చేశారు. జనవరి చివర్లో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు సల్మాన్ కూడా పాల్గొంటాడట. ప్రస్తుతం పరిస్థితులు బాలేదు కాబట్టి.. సిట్యుయేషన్స్ ఎలా మారతాయో చూశాకే వర్క్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
నిజానికి సల్మాన్ పాత్ర నిడివి తక్కువే. కొన్ని సీన్స్ మాత్రమే ఉంటాయి. అయితే ఒరిజినల్ స్క్రిప్ట్లో లేని చాలా విశేషాలు తెలుగులో ఉండబోతున్నాయి. వాటిలో భాగంగా చిరు, సల్మాన్లపై ఓ పాటను ప్లాన్ చేశాడు దర్శకుడు మోహన్ రాజా. ఈ పాటను వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్తో పాడించాలనుకుంటున్నారు. సల్మాన్కి సంబంధించిన షూట్కి ఐదు నుంచి వారం రోజులు సరిపోతుందట. అందుకే ఓసారి సల్మాన్ వస్తే ఇక గ్యాప్ ఇవ్వకుండా తన పోర్షన్ని కంప్లీట్ చేసేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on January 11, 2022 8:56 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…