టాలీవుడ్లో వారసుల జోరు మామూలుగా లేదిప్పుడు. కాస్త పేరున్న హీరోల దగ్గర్నుంచి లిస్టు తీస్తే మెజారిటీ వాళ్లే కనిపిస్తారు. పర్సంటేజ్ తీస్తే 70-80 శాతం వాళ్లదే ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్లోకి కొత్తగా ఇంకో ఇద్దరు వారసులు వస్తున్నారు. వాళ్లే గల్లా అశోక్, అశిష్ రెడ్డి. అశోక్ సూపర్ స్టార్ కృష్ణకు మనవడు, మహేష్ బాబుకు మేనల్లుడు. అశిష్ రెడ్డి దిల్ రాజు సోదరుడి కొడుకు. వీళ్లిద్దరి సినిమాలు హీరో, రౌడీ బాయ్స్ సంక్రాంతి కానుకలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఈ ఇద్దరిలో అశోక్కు బ్యాగ్రౌండే కొంచెం బలమైంది. మహేష్ మేనల్లుడంటే ఆటోమేటిగ్గా కొంత క్యూరియాసిటీ ఉంటుంది. దీనికి తోడు భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ లాంటి విభిన్న చిత్రాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య హీరో మూవీకి దర్శకుడు కావడం, దీని ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తోంది.
గల్లా అశోక్ లాంచింగ్ కోసం చాలా ఏళ్ల ముందే సన్నాహాలు మొదలయ్యాయి. అతను హీరో కావడానికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయడం, అది మహేష్ మూవీకే కావడం విశేషం. మహేష్ కెరీర్లో అతి పెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచిన శ్రీమంతుడు మూవీకి అశోక్.. కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. హీరో కావాలన్నా సరే.. సినిమా గురించి పూర్తిగా తెలిసి ఉండాలనే ఉద్దేశంతో మహేష్ రెకమండేషన్తో ఆయన సినిమాకే ఏడీగా పని చేశాడు అశోక్.
ఆ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్లో అశోక్ తెరంగేట్రానికి ఏర్పాట్లు జరిగాయి. ఐతే ఆ సబ్జెక్ట్ నచ్చక సినిమా పక్కకు వెళ్లిపోయింది. తర్వాత హీరో లైన్లోకి వచ్చింది. హీరోగా అరంగేట్ర చిత్రానికి హీరో అనే టైటిలే పెట్టుకోవడం.. సినిమా హీరో కావాలన్న కుర్రాడి పాత్రనే ఇందులో అశోక్ పోషించడం విశేషమే. మరి తొలి చిత్రంతో అశోక్ ఎలాంటి ముద్ర వేస్తాడు.. మున్ముందు ఎలా ఎదుగుతాడు అన్నది చూడాలి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…