దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండటం.. కేసులు రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో వేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఒక్కో రాష్ట్రం ఆంక్షల దిశగా అడుగులు వేస్తోంది. నియంత్రణ చర్యలు చేపడితే ముందుగా ప్రభావితం అయ్యేది థియేటర్లే అన్నది తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించారు.
నైట్ కర్ఫ్యూల వల్ల సెకండ్ షోలు రద్దయ్యాయి. మంగళవారం రెండు పెద్ద రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డాయి. ఉత్తరాదిన బీహార్లో థియేటర్లను మూసి వేస్తున్నట్లు ముందుగా ప్రకటన రాగా.. కొన్ని గంటల్లోనే తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే బాట పట్టింది. రాష్ట్రంలో థియేటర్లన్నింటినీ మూసివేయాలని నిర్ణయించింది. దీంతో అక్కడి ప్రేక్షకుల్లో ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న భారీ చిత్రం వలిమైని వాయిదా వేయక తప్పని పరిస్థితి తలెత్తింది.
ఇంకా చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. వలిమై వాయిదా పడటం లాంఛనమే అని తేలిపోయింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. తమిళంతో పాటు వివిధ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేశారు. ఇదే పేరుతో తెలుగులో సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ కూడా వదిలారు. కానీ కొన్ని గంటల్లోనే వేగంగా పరిస్థితులు మారిపోయాయి.
కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతుండటంతో వలిమై లాంటి భారీ చిత్రం సంక్రాంతికి రిలీజైతే వైరస్ ఉద్ధృతి మరో స్థాయికి చేరడం ఖాయం. అందుకే ముందే థియేటర్లను మూయించి ఆ చిత్ర బృందానికి ఒక క్లారిటీ ఇచ్చేసినట్లు అయింది. ఇలా చేయకుంటే రిలీజ్కు ఏర్పాట్లు జరిగిపోతాయి. చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా వేయాల్సి వస్తే అంతటా గందరగోళం నెలకొంటుంది. అందుకే ముందే క్లారిటీ ఇచ్చేశారు. చూస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్లపై ఆంక్షలు తప్పేలా లేవు. ఇక్కడా సంక్రాంతి సినిమాలకు పంచ్ పడేలా ఉంది.
This post was last modified on January 5, 2022 12:24 am
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…