థియేటర్లలోకి దిగే చిన్న సినిమాల పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది రోజు రోజుకూ. కరోనా మహమ్మారి పుణ్యమా అని జనాలు మామూలుగానే థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. పెద్ద సినిమాలంటే ఉండే క్రేజ్ వేరు కాబట్టి వాటికి మంచి టాక్ వస్తే వసూళ్లు బాగుంటున్నాయి. యావరేజ్ టాక్తోనూ అవి ఓ మోస్తరుగా నడుస్తాయి.
కానీ చిన్న సినిమాల పరిస్థితి అలా కాదు. టాక్ బాగున్నా సరే.. థియేటర్లకు జనాలను రప్పించడం కష్టమవుతోంది. అందులోనూ తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచేయడం చిన్న సినిమాల ఆక్యుపెన్సీ మీద మరింత ప్రభావం చూపిస్తున్నట్లే కనిపిస్తోంది. 2021 చివరి సినిమాగా శుక్రవారం నాడు శ్రీ విష్ణు సినిమా అర్జున ఫల్గుణ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మామూలుగానే ఈ సినిమాకు అంతగా బజ్ లేదు. దీనికి తోడు పూర్తి నెగెటివ్ టాక్ రావడంతో సినిమా వాషౌట్ అయిపోయింది.
పుష్ప, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు బాగా ఆడుతున్న టైంలో వచ్చి, డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అర్జున ఫల్గుణ బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోయింది. రిలీజ్ చేసిందే తక్కువ థియేటర్లలో. పైగా టాక్ బాగా లేదు. అందులోనూ తెలంగాణలో టికెట్ల రేట్లు పెరిగిపోయాయి. ఇక థియేటరుకొచ్చి ఈ సినిమాను చూసేదెవరు? థియేటర్ల మెయింటైనెన్స్ డబ్బులు కూడా రాక షోలు తగ్గించేశారు. వీకెండ్ అయ్యేసరికే సినిమా అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి తలెత్తింది.
కథల ఎంపికలో మంచి అభిరుచి ఉన్నవాడిగా పేరున్న శ్రీవిష్ణు, ఇప్పటిదాకా మంచి మంచి సినిమాలు నిర్మించిన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డిలకు అర్జున ఫల్గుణ చాలా చెడ్డ పేరు తెచ్చింది. శ్రీ విష్ణు కెరీర్లో హిట్లున్నా సరే.. అతడికి స్టార్ ఇమేజ్ లేకపోవడం, మాస్ ఫాలోయింగ్ లేకపోవడంతో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న అతడి సినిమాలు అస్సలు నిలబడట్లేదు. ఇంతకుముందు తిప్పరా మీసం లాగే అర్జున ఫల్గుణ కూడా వాషౌట్ అయిపోయింది బాక్సాఫీస్ దగ్గర.
This post was last modified on January 3, 2022 9:35 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…