ఏది ఏమైనా సరే అనుకున్నట్లే ‘ఆర్ఆర్ఆర్’ను జనవరి 7న విడుదల చేయడానికి సిద్ధమైపోయింది చిత్ర బృందం. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఢిల్లీలో థియేటర్లు మూసి వేయడం, మరికొన్ని రాష్ట్రాలు ఆంక్షల దిశగా అడుగులు వేస్తుండటంతో ఈ భారీ చిత్రానికి కచ్చితంగా కలెక్షన్ల పరంగా డెంట్ పడేలాగే కనిపిస్తోంది. ఆల్రెడీ హిందీ మూవీ ‘జెర్సీ’ విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ను అలా సింపుల్గా వాయిదా వేసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే ఆ చిత్రం మూడుసార్లు వాయిదా పడింది.
ఇప్పుడు పోటీలో ఉన్న వేరే చిత్రాలను చాలా కష్టపడి ఒప్పించి, తప్పించి జనవరి 7 విడుదలకు సిద్ధమైందీ సినిమా. దీని స్కేల్ దృష్ట్యా రిలీజ్ సన్నాహాలకు, ప్రమోషన్లకు కూడా చాలా కష్టపడ్డారు. ఇంతా చేసి విడుదల వాయిదా వేయడం అంటే చాలా కష్టమే. అందుకే నార్త్ ఇండియాలో కొంతమేర వసూళ్లలో కోత పడ్డా పర్వాలేదని ముందుకు వెళ్లిపోతున్నారు.
ఐతే లోలోన మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ టీంలో టెన్షన్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు. ఇంకో వారం తర్వాత కరోనా తీవ్రత పెరిగితే.. సినిమా రిలీజయ్యాక ఆంక్షలు ఎక్కువైతే.. నైట్ కర్ఫ్యూలతో ఎక్కువ చోట్ల సెకండ్ షోలు రద్దయితే.. 50 శాతం ఆక్యుపెన్సీ పెడితే.. మరిన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడితే.. అప్పుడు పరిస్థితి ఏంటన్నదే అర్థం కావడం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రం విడుదలవుతుంటే దేశవ్యాప్తంగా కోట్ల మంది థియేటర్లకు వస్తారు. ప్రతి థియేటర్ దగ్గరా వందల మంది గుమికూడతారు. సోషల్ డిస్టన్స్కు ఛాన్సే ఉండదు. దీని వల్ల కరోనా కేసుల సంఖ్య కచ్చితంగా పెరగొచ్చు. దాని వల్ల కరోనా తీవ్రత పెరిగినట్లవుతుంది.
ఈ వేసవిలో ‘వకీల్ సాబ్’ లాంటి భారీ చిత్రం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు కూడా ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో టెన్షన్ ఉంటుంది. రిలీజ్ ఆపమని చెప్పలేరు కానీ.. సినిమా చూసే విషయంలో ప్రేక్షకులను డిస్కరేజ్ చేసేలా ఎక్కడికక్కడ నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ఆస్కారం లేకపోలేదు. ఇందులో భాగంగానే నైట్ కర్ఫ్యూలు, 50 పర్సంట్ ఆక్యుపెన్సీలు వస్తే ఆశ్చర్యమేమీ లేదు. మరి ఇలాంటి చర్యలతో వసూళ్లపై గట్టిగానే ప్రభావం పడే పరిస్థితి వస్తే ఎలా అన్న ఆందోళన ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ టీంను వెంటాడుతోంది.
This post was last modified on December 30, 2021 2:30 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…