తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలు చేసిన తర్వాత బాలీవుడ్లో బిజీ అయిపోయింది కియారా అద్వానీ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంది. వాటిలో రామ్ చరణ్, శంకర్ల సినిమా ఒకటి. చాలా గ్యాప్ తర్వాత ఆమె చేస్తున్న సినిమా ఇది.
అయితే ఈమధ్య సినిమాల కంటే మరో విషయానికి వార్తల్లో నిలుస్తోంది కియారా. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆమె ప్రేమలో ఉంది. ఆ విషయాన్ని ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇద్దరూ కలిసి చాలాసార్లు మీడియా కంటబడటంతో విషయం వైరల్ అయ్యింది. రీసెంట్గా సిద్ధార్థ్ ఇంటికెళ్లినప్పుడు కూడా కియారా కెమెరాల కంటికి చిక్కింది. అయితే అక్కడ జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్ల విపరీతంగా ట్రోలింగ్కి గురయ్యింది.
సిద్ధార్థ్ ఇంటి ముందు ఓ వృద్ధుడు వాచ్మేన్గా ఉన్నాడు. కియారా కారు రాగానే పరిగెత్తుకు వెళ్లి డోరు తెరిచాడు. ఆమెకి సెల్యూట్ చేశాడు. ఇది గమనించిన నెటిజన్స్ కియారాని కార్నర్ చేశారు. అంత పెద్దాయనతో సెల్యూట్ చేయించుకోవాలా అంటూ తనని తప్పుబట్టారు. ఆమెకి తలపొగరు ఎక్కువని, కాస్త కూడా మానవత్వం లేదని ట్రోల్ చేయసాగారు. అది కియారాకి కోపం తెప్పించింది. రీసెంట్ ఇంటర్వ్యూలో మండిపడింది.
‘ఆయన్ని సెల్యూట్ చేయమని నేను అడిగానా? సెక్యూరిటీ గార్డ్ కాబట్టి సహజంగానే ఆ పని చేసి ఉంటాడు. దానికి నన్ను ఆడిపోసుకోవడం దేనికి? కారులోంచి దిగుతుంటే ఫొటోలు, వీడియోలు తీసి వైరల్ చేశారు. ఇది కరెక్టా? నా స్థానంలో ఒక హీరో ఉంటే ఇలాగే ట్రోల్ చేస్తారా’ అంటూ ఆవేశంగా మాట్లాడింది. ఇలాంటివి మాట్లాడేముందు మీరెంత కరెక్టో చెక్ చేసుకోండి అంటూ క్లాస్ పీకింది. ఈ విషయంలో ఇంత మాట్లాడింది కానీ సిద్ధార్థ్తో తన ప్రేమ విషయంలో మాత్రం రియాక్టవకుండా తెలివిగా మాట దాటవేసింది కియారా.
This post was last modified on December 28, 2021 4:36 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవడం సవాలుగా మారింది. తెలుగులో…
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…