Movie News

డ్రగ్స్ కేసులో బెదిరింపులు.. నటి ఆత్మహత్య!

కొందరు వ్యక్తులు డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించడంతో యువనటి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫేక్ ఎన్‌సీబీ అధికారుల రైడింగ్ తో కలత చెందిన నటి ముంబైలో సూసైడ్ చేసుకొని మరణించింది. వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 20న తన స్నేహితులతో కలిసి హుక్కా పార్లర్ కు వెళ్లింది ముంబైకి చెందిన యువనటి. అప్పుడు అక్కడకు ఇద్దరు వ్యక్తులు ఎన్‌సీబీ అధికారులమంటూ వచ్చి రైడ్ చేశారు. 

ఈ క్రమంలో సదరు నటిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. అలా చేయకుండా ఉండాలంటే.. రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె అతికష్టం మీద రూ.20 లక్షలు అడ్జస్ట్ చేసి వాళ్లకు ఇచ్చింది. అయినప్పటికీ వారు మరింత డబ్బు కావాలని వేధింపులకు గురి చేశారు. దీంతో భయపడిన ఆమె డిసెంబర్ 23న తన అపార్ట్మెంట్ లో సూసైడ్ చేసుకొని చనిపోయింది. 

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో వారికి కొన్ని విషయాలు తెలిశాయి. రైడ్ చేసింది ఫేక్ ఎన్‌సీబీ అధికారులని పోలీసులు గుర్తించారు. ఎన్‌సీబీ అధికారులమని చెప్పుకున్న నిందితులు సూరజ్ పర్దేశి, ప్రవీణ్ వాలింబేను అరెస్ట్ చేశారు. అయితే సదరు నటి దగ్గర డబ్బులు నొక్కడానికి ఆమె స్నేహితులే పార్టీకి తీసుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఎన్‌సీబీ సంస్థపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సీబీ అధికారులు ప్రయివేట్ ఆర్మీను సృష్టించి సెలబ్రిటీలను కావాలనే వేధిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు నటి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులతో ఎన్‌సీబీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. 

This post was last modified on December 27, 2021 12:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

2 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

3 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago