పెద్దవాళ్లు ఓ విషయం చెబుతుంటారు. కింద పడినంత మాత్రాన కెరటానికి వచ్చిన నష్టమేమీ లేదు.. తిరిగి అంతే వేగంతో లేస్తుంది, తన సత్తా చూపిస్తుంది అని. సమంతని చూస్తే ఇప్పుడదే అనిపిస్తోంది. సినీ పరిశ్రమలో చాలా జంటలు విడాకులు తీసుకుంటాయి. కానీ ఎవరూ ఫేస్ చేయనన్ని అవమానాలు ఫేస్ చేసింది సమంత. ట్రోలర్ల వేధింపులు భరించలేక కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చిందామెకి.
అయితే అదంతా కొంతవరకే. కళ్లు మూసి తెరిచేలోగా తనను తాను సమస్య నుంచి తెలివిగా బైట పడేసుకుంది సామ్. పర్సనల్ విషయాలను పక్కన పెట్టేసింది. పనిపైనే దృష్టి పెట్టింది. కొత్త కొత్త ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతోంది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ‘యశోద’, హాలీవుడ్లో ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ చిత్రాలతో పాటు అశ్విన్ శరవణన్ డైరెక్షన్లో ఓ తమిళ మూవీకి కమిటయ్యింది. రీసెంట్గా ‘యశోద’ ఫస్ట్ షెడ్యూల్ని కంప్లీట్ చేసేసింది కూడా. ఇదంతా ఒకవైపు.
సమంత బాలీవుడ్ ప్రయత్నాలు మరోవైపు. ఇప్పటికే ‘ఫ్యామిలీ మేన్ 2’తో బాలీవుడ్ వారికి దగ్గరైన సామ్, ఇప్పుడు ఆ మేకర్స్ తీస్తున్న మరో వెబ్ సిరీస్కి కూడా కమిటయ్యింది. ‘అవెంజర్స్’ తీసిన రసో బ్రదర్స్ అమెజాన్ ప్రైమ్ కోసం ‘సిటాడెల్’ అనే అమెరికన్ యాక్షన్ సిరీస్ తీస్తున్నారు. ప్రియాంకా చోప్రా ఫిమేల్ లీడ్గా నటిస్తోంది. అదే సిరీస్ని హిందీలోనూ తీయబోతోంది అమెజాన్. రాజ్, డీకే డైరెక్ట్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ హీరో. ప్రియాంక పాత్రలో సమంత కనిపించబోతోంది. గూఢచారి పాత్రలో యాక్షన్ సీక్వెన్సులు కూడా అదరగొట్టనుంది.
ఇది మాత్రమే కాదు.. తాప్సీ నిర్మించే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటించబోతోంది సామ్. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ స్టార్టయ్యిందని, త్వరలోనే అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ఇవన్నీ చూస్తుంటే సమంత ప్లానింగ్ ఏ రేంజ్లో ఉందో తెలుస్తోంది. వ్యక్తిగత జీవితంలో కలిగిన బాధ ఆమెని ఏమాత్రం వెనక్కి లాగలేదని అంతకంతకీ ముందుకెళ్తున్న సామ్ని చూస్తే అర్థమవుతోంది.
This post was last modified on December 25, 2021 3:45 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…