చాలా కాలంగా టాలీవుడ్ లో టికెట్ రేట్ ఇష్యూ నడుస్తోంది. ఏపీలో ప్రభుత్వం నిర్ణయించే రేట్లకే సినిమా టికెట్లను అమ్మాలని జీవో జారీ చేయడం, దాన్ని కొందరు తారలు వ్యతిరేకించడం తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం తప్ప.. మన తారలెవరూ కూడా ఈ విషయం మీడియా ముఖంగా మాట్లాడింది లేదు. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం ఎప్పటికప్పుడు ఈ విషయంపై రియాక్ట్ అవుతూనే ఉన్నారు.
రీసెంట్ గా ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి ఆయన టికెట్ రేట్ ఇష్యూ గురించి మాట్లాడారు. థియేటర్లో రోజువారీ కలెక్షన్స్ కంటే.. పక్కనున్న కిరాణా షాపులకే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయని ఆయన నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయంలో చాలా మంది నానిని సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆయన్ను విమర్శిస్తున్నారు.
ఇప్పటికే నానికి ఏపీ మంత్రులు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా నానిపై ఫైర్ అయ్యారు. హీరో నాని ఎవరో తనకు తెలియదని వ్యంగ్యంగా అన్నారు అనిల్ కుమార్. తనకు తెలిసిందల్లా.. మంత్రి కొడాలి నాని మాత్రమేనని అన్నారు. కేవలం టికెట్ రేట్ తగ్గితే తమ రెమ్యునరేషన్ తగ్గుతుందనే బాధతో కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. రూ.50 కోట్ల రెమ్యునరేషన్, ఇరవై లేదా ముప్పైకి తగ్గుతుందనే బాధ తప్ప.. వారి ఆవేదనలో అర్ధం లేదని అన్నారు. ‘భీమ్లానాయక్’, ‘వకీల్ సాబ్’ సినిమాలకు పెట్టిన ఖర్చు ఎంత..? పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత..? అని ప్రశ్నించారు. పవన్ తన క్రేజ్ ని అమ్ముకుంటున్నారని అన్నారు.
ఒకప్పుడు తాను కూడా బైక్ అమ్మి పవన్ కళ్యాణ్ సినిమాకి కటౌట్ లు కట్టానని.. డబ్బులు ఊడగొట్టుకున్నానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ అభిమానుల పరిస్థితి కూడా ఇంతేనని అన్నారు. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ కంటే రెమ్యునరేషన్ కాస్ట్ ఎక్కువగా ఉంటుందని.. సినిమాకి అయ్యే ఖర్చులో ఎనభై శాతం నలుగురి జేబుల్లోకే వెళ్తున్నాయని.. దానికోసం కోట్లాది మంది ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు అనిల్ కుమార్. ఇలాంటి వాళ్ల కోసం టికెట్ రేట్లు పెంచాలా..? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
This post was last modified on December 24, 2021 4:09 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…